న్యూఢిల్లీ: ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్లో అద్భుత ప్రదర్శనతో ఫైనల్ చేరిన మిథాలీ సేనకు బీసీసీఐ భారీ నగదు నజరానా ప్రకటించింది. అసాధారణ పోరాటంతో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్ వంటి అగ్రశ్రేణి జట్లను ఓడించి ఫైనల్కు అర్హత సాధించిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో బీసీసీఐ భారత జట్టు సభ్యులకు తలో రూ.50 లక్షలు నగదు నజరానా ప్రకటించింది. సహాయ సిబ్బందికి తలో రూ.25 లక్షలు ప్రకటించింది. 'క్రికెట్ మక్కా' లార్డ్స్ వేదికగా ఫైనల్ మ్యాచ్లో మిథాలీసేన ఇంగ్లాండ్తో తలపడనుంది.

కెప్టెన్ మిథాలీ రాజ్, హర్మన్ప్రీత్ కౌర్, స్మృతి మంధాన, పూనమ్ కౌర్, వేద కృష్ణమూర్తి దాదాపు అన్ని మాచ్ లలోనూ అద్భుత ప్రదర్శన కనబర్చి జట్టును ఫైనల్ చేర్చారు. అలాగే రాజేశ్వరీ గైక్వాడ్, జులన్ గోస్వామి, శిఖ పాండే, ఏక్తా బిష్ఠ్ అద్భుత బౌలింగ్తో జట్టుకు విజయాలు అందించారు.