వరల్డ్ కప్ను అందరూ ధోనీటా ముగించలేరని, అది అందరి వల్లా అయ్యే పని కాదని మాజీ లెజెండ్ గౌతమ్ గంభీర్ చెప్పాడు. అలాగే కలిసి బ్యాటింగ్ చేసే సమయంలో తన ఫేవరెట్ పార్టనర్.. పరిమిత ఓవర్ల క్రికట్లోనే అని గంభీర్ చెప్పుకొచ్చాడు. 2011లో వరల్డ్ కప్ నెగ్గిన జట్టులో వీళ్లిద్దరి భాగస్వాములనే విషయం తెలిసిందే. ఆ మ్యాచులో గంభీర్, ధోనీ భాగస్వామ్యం జట్టుకు విజయాన్ని
గంభీర్ తన కెరీర్లో సింహభాగం.. డ్యాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్తో కలిసి గంభీర్ ఓపెనింగ్ చేసేవాడు. అదే సమయంలో ధోనీ ఎక్కువగా మిడిలార్డర్లో ఆడేవాడు. గంభీర్, ధెనీ ఇద్దరూ కలిసి ఆడిన ప్రతిసారీ మాజీలు, నిుణులు తగ మెచ్చుకునే వారు. వీళ్లిద్దరూ వికెట్ల మధ్య చాలా వేగంగా పరిగెడుతూ ప్రత్యర్థులపై ఒత్తిడి పెంచేవారు.

'నా ఫేవరెట్ బ్యాటింగ్ పార్టనర్ ఎంఎస్ ధోనీనే. ఫ్యాన్స్ అందరూ కూడా వీరేంద్ర సెహ్వాగ్ నా ఫేవరెట్ అని అనుకుంటారు. కానీ నేను ధోనీతో కలిసి ఆడేందుకు ఛాన్స్ తక్కువగా ఉండేది. కానీ వైట్బాల్ క్రికెట్లో తనతో కలిసి ఆడటాన్ని బాగా ఎంజాయ్ చేసేవాడిని. మేం ఎన్నో విలువైన భాగ్వాస్వామ్యాలను నిర్మించాం' అని గంభీర్ చెప్పుకొచ్చాడు.
2011 వరల్డ్ కప్ ఫైనల్లో కూడా గంభీర్ 97 పరుగులతో ఆకట్టుకున్నాడు. అదే మ్యాచులో ధోనీ 91 నాటౌట్తో కీలక మైన ఇన్నింగ్స్ ఆడటంతోపాటు చివర్లో విన్నింగ్స్ సిక్సర్ బాదిన ధనీ.. కప్పును తన ఖాతాలో వేసుకొని, ఆ మ్యాచ్ క్రెడిట్ అంతా కొట్టేశాడని పలుమార్లు గంభీర్ విమర్శలు చేసిన సంగతి తెలిసిందే.

క్రికెట్ అనేది టీం గేమ్ అని, ఎవరో ఒక్కరు దీన్ని గెలవలేరని గంభీర్ పలుమార్లు చెప్పాడు. వ్యక్తి పూజ తగదని, దాని వల్లనే భారత జట్టు ఆ తర్వాత మరో ఐసీసీ ట్రోఫీ నెగ్గలేదని అన్నాడు. ఈ క్రమంలోనే ధోనీకి, గంభీర్కు పడటం లేదని వార్తలు వెల్లువెత్తాయి. ఇప్పుడు గంభీర్ మాటలతో ఈ లక్ష్యం