వరల్డ్ కప్ ముగిసిన వెంటనే టీమిండియా ఫ్యాన్స్కు క్రికెట్ జోష్ తగ్గదు. ఎందుకంటే వరల్డ్ కప్ అయిపోయిన తర్వాత ఆస్ట్రేలియా, భారత్ మధ్య ఐదు టీ20ల సిరీస్ జరగనుంది. ఈ సిరీసులో వరల్డ్ కప్ ఆడిన సీనియర్లకు విశ్రాంతి ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. కొత్త కుర్రాళ్లకు అవకాశాలు ఇస్తారట. రాజస్థాన్ రయాల్స్ కుర్రాడు రియాన్ పరాగ్కు కూడా ఈ సిరీసులో అవకాశం దక్కొచ్చని వార్తలు వస్తున్నాయి
ఈ క్రమంలో ఈ సిరీస్ గురించి మరో కీలక అప్డేట్ వచ్చింది. మొత్తం ఐదు టీ20లు జరిగే ఈ సిరీసులో చివరి మ్యాచ్కు హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ స్టేడియంలో జరగాల్సి ఉంది. కానీ ఇప్పుడు ఆ మ్యాచ్ వేదికను మార్చేసినట్లు తెలుస్తోంది. దీన్ని చెన్నైలోని చెపాక్ స్టేడియానికి ఈ మ్యాచ్ మార్చేస్తున్నట్లు అధికారికంగా ఇంకా ప్రకటన రాలేదు.

అయితే దీనికి ఒక కారణం కూడా ఉంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఐదు రాష్ట్రాల్లో ఎలక్టన్లు జరుగుతున్న సంగతి తెలిసిందే. వాటిలో తెలంగాణ కూడా ఒకటి. ఈ క్రమంలోనే మ్యాచ్కు పోలీసులు భద్రత కల్పించడం కూడా కష్టమేనని తెలుస్తోంది. ఈ క్రమంలోనే మ్యాచ్ వేదికను చెన్నైకి షిప్ట్ చేసేశారట.
తెలంగాణలో ఎన్నికల కారణంగానే ఈ మ్యాచ్ వేదికను మారుస్తున్నట్లు తెలుస్తోంది. కాగా, నవంబరు 30న తెలంగాణలో ఎన్నికలు జరుగుతాయి. ఆ తర్వాత ఎన్నికల లెక్కింపు డిసెంబరు 3న జరుగుతుంది. ఇక ఆసీస్ సిరీసులో హార్దిక్ పాండ్యా రీ ఎంట్రీ ఇచ్చే అవకాశాలు ఉన్నట్టు సమాచారం.
వరల్డ్ కప్లో బంగ్లాదేశ్తో మ్యాచ్ సమయంలో అతను గాయపడిన సంగతి తెలిసిందే. ఈ గాయం కారణంగా అతను ఈ మెగా టోర్నీ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఈ ఐదు టీ20ల సిరీస్ ముగిసిన వెంటనే.. భారత జట్టు మళ్లీ మరో సిరీస్ ఆడనుంది. దీని కోసం సౌతాఫ్రికా వెళ్లాల్సి ఉంది.