అతిపెద్ద క్రికెట్ వేడుక వరల్డ్ కప్కు అంతా రెడీ అయింది. మరికొన్ని రోజుల్లో అసలు సిసలు క్రికెట్ సమరం మొదలవుతుంది. దాని కన్నా ముందు వార్మప్ మ్యాచుల కోసం కూడా ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో అసలు ఈ మెగా క్రికెట్ పండుగ ద్వారా అత్యధికంగా లాభాలు చూసే దేశాలు ఏవని చాలామందికి అనుమానం వచ్చి ఉంటుంది.
తాజాగా తెలిసిన లెక్కల ప్రకారం చూసుకుంటే.. ఈ వరల్డ్ కప్ వల్ల దాదాపు అన్ని క్రికెట్ దేశాల ఆర్థిక వ్యవస్థలకు భారీగానే లాభాలు చేకూరనున్నాయి. ఐసీసీ చెప్పిన గణాంకాల ప్రకారం ఆస్ట్రేలియా, న్యూజిల్యాండ్ దేశాల్లో కలిపి ఆల్మోస్ట్ రూ.2,887 కోట్ల రూపాయల బిజినెస్ జరుగుతుంది. అంటే ఆ దేశ ఎకానమీల్లో ఇంత డబ్బు చేరుతుందని అంచనా.

అదే ఇంగ్లండ్ ఆర్థిక వ్యవస్థకు ఏకంగా రూ.3727 కోట్ల డబ్బు చేరుతుందని తెలుస్తోంది. అయితే అన్ని దేశాల కన్నా ఎక్కువగా ఆతిథ్య దేశమైన భారత్కే ఎక్కువ డబ్బు వస్తుందట. ఈ మెగా టోర్నీ ద్వారా భారత ఆర్థిక వ్యవస్థలో ఏకంగా రూ.13,318 కోట్ల రూపాయలు చేరతాయట. ఈ లెక్కలు చూస్తేనే క్రికెట్ మార్కెట్ ఎంతగా అభివృద్ధి చెందిందో అర్థం చేసుకోవచ్చు.
ఇక టోర్నీ విషయానికొస్తే ఓవరాల్గా పది మిలియర్ డాలర్ల బడ్జెట్తో వరల్డ్ కప్ మొదలవుతుంది. వీటిలో విజేతలకు ఏకంగా 4 మిలియలన్ డాలర్లు దక్కుతాయి. ఇక రన్నరప్గా నిలిచిన టీంకు 2 మిలియన్ డాలర్లు, అలాగే సెమీఫైనల్స్లో ఓడిన రెండు జట్లకు తలో 1.6 మిలియన్ డాలర్లు అందజేస్తారట.
అక్టోబర్ 5న మొదలయ్యే ఈ మెగాటోర్నీ తొలి మ్యాచ్కు అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం ఆతిథ్యం ఇస్తుంది. గత వరల్డ్ కప్ ఫైనలిస్టులు ఇంగ్లండ్, న్యూజిల్యాండ్ ఈ మ్యాచులో తలపడతాయి. ఇక క్రికెట్ ఫ్యాన్స్ అంతా ఎదరు చూస్తున్న ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ కూడా ఇదే స్టేడియంలో అక్టోబర్ 14న జరుగుతుంది.