సర్ఫరాజ్ అహ్మద్తో ఫోన్లో మాట్లాడిన పీసీబీ ఛైర్మన్
ఈ మేరకు పాకిస్థాన్ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్తో పీసీబీ ఛైర్మన్ ఫోన్లో మాట్లాడినట్లు వార్తలను ప్రచురించాయి. "దేశమంతా మీకు అండగా ఉంది. రాబోయే రోజుల్లో కలసికట్టుగా మెరుగైన ప్రదర్శనను ఇస్తారని ఆశిస్తున్నాం" అని ఆయన కెప్టెన్ సర్ఫరాజ్తో చెప్పినట్లు అందులో పేర్కొన్నాయి.
సోషల్ మీడియాలో వస్తోన్న వార్తా కథనాలపై
సోషల్ మీడియాలో వస్తోన్న వార్తా కథనాలను పట్టించుకోకుండా రానున్న మ్యాచ్ల్లో కెప్టెన్గా జట్టును ముందుకు నడిపించాలని చైర్మన్ ఎహ్సాన్ మణి సర్ఫరాజ్ అహ్మద్ను కోరినట్లు న్యూస్ ఎక్స్ తన కథనంలో పేర్కొంది. మాంఛెస్టర్ వేదికగా భారత్తో తలపడిన మ్యాచ్లో దారుణంగా పరాజయంపాలవ్వడం పాకిస్తాన్ క్రికెట్ జట్టులో భయాందోళనలను నింపింది.
ఒంటరిగా ఇంటికి వెళ్లొద్దని సర్ఫరాజ్ సూచన
భారత్ చేతిలో ఓటమి నేపథ్యంలో స్వదేశంలో అడుగు పెట్టిన తరువాత ఒంటరిగా ఇంటికి వెళ్లొద్దని సర్ఫరాజ్ అహ్మద్ తన జట్టు సభ్యులకు సూచించినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఓ కథనాన్ని పాకిస్తాన్కు చెందిన ఓ వెబ్సైట్ ప్రచురించింది. ఇంటికి వెళ్లేటప్పుడు గానీ, బయట తిరిగేటప్పుడు గానీ కొంచెం జాగ్రత్తగా ఉండాలని సర్ఫరాజ్ సూచించినట్లు పేర్కొంది.
23న లార్డ్స్లో సఫారీలతో మ్యాచ్
ఇదిలా ఉంటే, ఈ మెగా టోర్నీలో ఇప్పటివరకు ఐదు మ్యాచ్లాడిన పాక్ 3 పాయింట్లతో పాయింట్ల పట్టికలో 9వ స్ధానంలో నిలిచింది. టోర్నీలో భాగంగా జూన్ 23న తన తదుపరి మ్యాచ్లో లార్డ్స్ వేదికగా దక్షిణాఫ్రికాతో తలపడనుంది.