ఇంగ్లాండ్కు ప్రతిష్టాత్మకం
దీంతో లార్డ్స్ ఆతిథ్యమిస్తోన్న ఈ మ్యాచ్ ఇంగ్లాండ్కు ప్రతిష్టాత్మకం కానుంది. ఈ మ్యాచ్లో గనుక ఇంగ్లాండ్ ఓడితే సెమీస్ అవకాశాలు మరింత క్లిష్టంగా మారతాయి. ప్రస్తుతం ఇంగ్లాండ్ జట్టు 8 పాయింట్లతో పట్టికలో నాలుగో స్థానంలో కొనసాగుతుంది. ఇప్పటివరకు ఆడిన 6 మ్యాచ్ల్లో ఇంగ్లాండా నాలుగు మ్యాచ్ల్లో గెలుపొందింది.
ఇంగ్లాండ్ గట్టి పోటీ
మరోవైపు బంగ్లాదేశ్(7 మ్యాచ్ల్లో 7 పాయింట్లు), శ్రీలంక(6 మ్యాచ్ల్లో 6 పాయింట్లు), పాకిస్థాన్(6 మ్యాచ్ల్లో 5 పాయింట్లు) ఇంగ్లాండ్ జట్టుకు గట్టి పోటీనిచ్చే పరిస్థితి. ఈ నేపథ్యంలో సచిన్ మంగళవారం ఇండియా టుడేకి ఇచ్చిన ఇంటర్యూలో మాట్లాడుతూ "ఇంగ్లాండ్ జట్టు తీవ్ర ఒత్తిడిలో ఉంది" అని తెలిపాడు.
ఆసీస్ వరుస విజయాలు
"ఆస్ట్రేలియా జట్టు ఆడిన తీరుని చూస్తే, వరుసగా విజయాలను నమోదు చేసింది. ఇదే ఇంగ్లాండ్ను తీవ్ర ఒత్తిడిలోకి నెట్టింది. అయితే, ప్రస్తుతం ఆసీస్ బౌలింగ్ ఎటాక్ అంత గొప్పగా లేదు. మిచెల్ స్టార్క్, కమ్మిన్స్ తర్వాత ఆసీస్ బౌలింగ్లో ఏదో మిస్సైంది. ఇక్కడే ఇంగ్లాండే అందిపుచ్చుకోవాలి" అని సచిన్ అన్నాడు.
అత్యుత్తమ జట్లలో ఇంగ్లాండ్ ఒకటి
"గత నాలుగేళ్లుగా ఇంగ్లాండ్ ఎలా ఆడిందో మనకు తెలుసు. ప్రపంచంలో అత్యుత్తమ జట్లలో ఒకటి. ఆ జట్టుని చూస్తే... గత వారంలో ఎటువంటి మార్పులు చోటు చేసుకోలేదు" అని సచిన్ టెండూల్కర్ తెలిపాడు. ఈ ప్రపంచకప్లో భాగంగా ఇంగ్లాండ్ జూన్ 30న తన తదుపరి మ్యాచ్లో టీమిండియాతో... జులై 3న న్యూజిలాండ్తో తలపడనుంది.