టీమిండియాతో జరిగే మ్యాచ్ ఎంతో ముఖ్యం
"టీమిండియాతో జరిగే మ్యాచ్ ఎంతో ముఖ్యం. టైటిల్ ఫేవరేట్గా బరిలోకి దిగిన టీమిండియాను ఓడించడం అంత సులువు కాదు. కానీ మేం గట్టి పోటీనిస్తాం. భారత్ జట్టులో అగ్రశ్రేణి ఆటగాళ్లున్నారు. ఒంటిచేత్తో మ్యాచ్ను గెలిపించే సత్తా వారికుంది. మేం మా సాయశక్తుల పోరాడుతాం. భారత్ను ఓడించే సత్తా మాకు ఉంది" అని షకీబ్ అన్నాడు.
షకీబ్ హాఫ్ సెంచరీ
ఈ మ్యాచ్లో షకీబ్ ఉల్ హాసన్ హాఫ్ సెంచరీతో రాణించి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. అంతేకాదు ఒక ప్రపంచకప్లో 400 కంటే ఎక్కువ పరుగులు చేయడంతోపాటు పది వికెట్లు కూడా తీసిన తొలి ప్లేయర్గా షకీబ్ అరుదైన ఘనత సాధించాడు. దీంతో పాటు ప్రపంచకప్లో 1000 పరుగులు చేసిన తొలి బంగ్లా క్రికెటర్గా రికార్డు నెలకొల్పాడు.
రెండో స్పిన్నర్గా అరుదైన గుర్తింపు
ఇక, ప్రపంచకప్ మ్యాచ్లో హాఫ్ సెంచరీ చేయడంతోపాటు ఐదు వికెట్లు తీసిన రెండో స్పిన్నర్గా గుర్తింపు పొందాడు. 2011 ప్రపంచకప్లో ఐర్లాండ్తో జరిగిన మ్యాచ్లో భారత ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ (5/31; 50 నాటౌట్) ఈ ఘనత సాధించాడు. మళ్లీ ఇన్నాళ్లకు ఈ ప్రపంచకప్లో షకీబ్ ఆరు మ్యాచ్లు ఆడి 476 పరుగులు చేసి, 10 వికెట్లు తీశాడు.
జులై 2న టీమిండియాతో మ్యాచ్
టోర్నీలో భాగంగా బంగ్లాదేశ్ తన తదుపరి మ్యాచ్ల్లో భారత్, పాకిస్తాన్లతో ఆడనుంది. జూలై 2న భారత్తో తలపడనుంది. దాదాపు వారంకు పైగా ఆ జట్టుకు విశ్రాంతి లభించడంతో సరైన ప్రణాళికలతో బరిలోకి దిగనుంది. ఇప్పటివరకు 7 మ్యాచ్లు ఆడిన బంగ్లాదేశ్ మూడు మ్యాచ్ల్లో విజయం సాధించి 7 పాయింట్లతో ఐదో స్థానంలో నిలిచింది.