తమ శరీర స్థితిని బట్టి మ్యాచ్లు ఆడాలి
ఇలాంటి తరుణంలో ఆటగాళ్లు ఎవరికి వారు తమ శరీర స్థితిని బట్టి మ్యాచ్లు ఆడాలని ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. మంగళవారం ఆ జట్టు మెంటార్ జహీర్ ఖాన్తో కలిసి రోహిత్ శర్మ మీడియా సమావేశంలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా రోహిత్ శర్మ ఆటగాళ్ల పనిభారంపై మాట్లాడాడు.
|
నాలుగేళ్లుగా దేశ విదేశాల్లో తిరుగుతూనే ఉన్నాం
"గత నాలుగేళ్లుగా దేశ విదేశాల్లో తిరుగుతూనే ఉన్నాం. ఇటీవల విరామం లేకుండా మ్యాచ్లు ఆడాం. ఐతే ఐపీఎల్లో ఎలా వ్యవహరించాలన్నది ఆటగాళ్ల వ్యక్తిగత విషయం. ఆటగాళ్లు తమ శరీరం ఏం చెబుతోందో వినాలి. ప్రపంచకప్ చాలా ముఖ్యమైన టోర్నీనే. కానీ ఐపీఎల్ కూడా పెద్దదే. దానికీ ప్రాధాన్యం ఇవ్వాల్సిందే" అని రోహిత్ శర్మ చెప్పాడు.
ఇంట్లో ఖాళీగా కూర్చోవడం కంటే ఐపీఎల్ ఆడటమే ఉత్తమం
"అన్నీ చూసుకుని పని భారాన్ని అంచనా వేసి ఎన్ని మ్యాచ్లు ఆడాలన్నది ఆటగాళ్లే నిర్ణయం తీసుకోవాలి" అని రోహిత్ శర్మ చెప్పాడు. మరోవైపు తమ పేసర్ బుమ్రా.. ఇంట్లో ఖాళీగా కూర్చోవడం కంటే ఐపీఎల్ ఆడటమే ఉత్తమమని కోచ్ జయవర్ధనే సూచించాడు. భారత పేసర్ల ఫిట్నెస్పై ఎలాంటి ఆందోళన లేదని అన్నాడు.
పాండ్యాపై పనిభారాన్ని ఐపీఎల్లో పర్యవేక్షిస్తాం
సరైన ప్రణాళికతో శారీరక శ్రమను జయించాలని అన్నాడు. ఇక, ఐపీఎల్ కంటే ప్రపంచకప్ గెలువడం చాలా ప్రధానమైందని ముంబై మెంటార్ జహీర్ ఖాన్ చెప్పాడు. వెన్ను నొప్పితో బాధపడుతున్న స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యాపై పనిభారాన్ని ఐపీఎల్లో పర్యవేక్షిస్తామని జహీర్ ఖాన్ అన్నాడు.