
జైపూర్ వేదికగా ఐపీఎల్ మహిళల టీ20 ఛాలెంజ్లో భాగంగా ట్రయల్ బ్లేజర్స్తో జరిగిన మ్యాచ్లో వెలాసిటీ 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 113 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన వెలాసిటీకి శుభారంభం దక్కింది. ఓపెనర్ హేలీ మాథ్యూస్ (5; 14 బంతుల్లో 1×4) నెమ్మదిగా ఆడినా.. మరో ఓపెనర్ షెఫాలీ వర్మ (34; 31 బంతుల్లో 5×4, 1×6) బ్యాట్ జులిపించింది. మాథ్యూస్ నిష్క్రమణ అనంతరం షెఫాలీతో కలిసి డేనియెల్ వ్యాట్ (46; 35 బంతుల్లో 5×4, 2×6) ఇన్నింగ్స్ను ముందుకు నడిపింది.
ఆ తర్వాత కెప్టెన్ మిథాలీ రాజ్ (17; 22 బంతుల్లో 1×4) కూడా పర్వాలేదనిపించింది. అయితే జట్టు స్కోరు 111 వద్ద.. 7 బంతుల వ్యవధిలో వ్యాట్, వేద కృష్ణమూర్తి, మిథాలీ రాజ్, శిఖ పాండే, అమెలియా కెర్ పెవిలియన్ బాట పట్టడంతో మ్యాచ్ ఉత్కంఠ రేపింది. 18వ ఓవర్ చివరి బంతికి సుశ్రీ ప్రధాన్ 2 పరుగులు తీసి విజయాన్ని అందించింది. దీప్తిశర్మ నాలుగు వికెట్లు తీసింది.

తొలుత బ్యాటింగ్ చేసిన ట్రయల్ బ్లేజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 112 పరుగులు చేసింది. స్మృతి మంధాన (10) నిరాశ పరిచినా.. హర్లీన్ డియోల్ (43), సుజీబేట్స్ (26) ఆదుకున్నారు. మధ్య ఓవర్లలో దీప్తి శర్మ (16) పోరాడింది. ఏక్తా బిష్ఠ్, అమెలియా కెర్ చెరో రెండు వికెట్లు తీశారు.