న్యూఢిల్లీ: ప్రపంచ కప్ సెమీ ఫైనల్కు ముందు భారత మహిళా క్రికెట్ కెప్టెన్ మిథాలీ రాజ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సెమీస్లో ఆస్ట్రేలియాను ఓడించేందుకు అసాధారణ ప్రతిభ కనబర్చాలన్నారు.
గురువారం సెమీ ఫైనల్లో ఆస్ట్రేలియా - భారత్ తలపడనున్నాయి. సెమీస్లో నెగ్గిన వాళ్లు ఫైనల్లో ఇంగ్లాండుతో ఢీకొంటారు. ఈ సందర్భంగా మిథాలి మాట్లాడారు.
ఇక్కడ ఇప్పటికే పలు మ్యాచ్లు ఆడామని, కాబట్టి ఇక్కడి పరిస్థితులు తమకు తెలుసునని మిథాలీ రాజ్ చెప్పారు. ఇక్కడి పరిస్థితులు తెలియడం ఓ ప్లస్ అన్నారు.
ఆస్ట్రేలియా టీం కూడా బలంగా ఉందని చెప్పారు. గత ఎడిషన్ వాళ్లు గెలిచారని, ఆ టీంకు కూడా ఒత్తిడి సమయంలో ఆడగలిగిన మంచి ప్లేయర్లు ఉన్నారని చెప్పారు.
కాగా, మిథాలీ రాజ్ గత ఏడు ఇన్నింగ్స్లలో 356 పరుగులు చేసి మంచి ఫాంలో ఉన్నారు. 6,000 పరుగులు చేసిన తొలి మహిళా ప్లేయర్.