
16 ఏళ్ల వయసులోనే అరంగేట్రం
16 ఏళ్ల వయసులో 1999లో వన్డేల్లో అరంగేట్రం చేసిన మిథాలీ.. ఐర్లాండ్తో జరిగిన తొలి మ్యాచ్లోనే సెంచరీ చేసింది. ఇప్పటికీ అత్యంత పిన్న వయసులో సెంచరీ చేసిన రికార్డు మిథాలీ పేరిట ఉండటం విశేషం. మహిళల క్రికెట్లో సచిన్ టెండూల్కర్గా మిథాలీకి పేరుంది. 19 ఏళ్ల వయసులో టాంటన్ వేదికగా ఇంగ్లాండ్తో జరిగిన టెస్టు మ్యాచ్లో 214 పరుగులు చేసి టెస్టుల్లో రెండో అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్గా అరుదైన గుర్తింపు సాధించింది.

టెస్టుల్లో రెండో అత్యధిక వ్యక్తిగత స్కోరు
టెస్టుల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదు చేసిన ప్లేయర్గా పాకిస్థాన్కు చెందిన కిరన్ బలూచ్ పేరిట ఉంది. 2004లో వెస్టిండిస్తో జరిగిన టెస్టు మ్యాచ్లో కిరన్ 242 పరుగులు చేసింది. ఇదిలా ఉంటే తన 18 ఏళ్ల అంతర్జాతీయ క్రికెట్ కెరీర్లో మిథాలీ రాజ్ ఎన్నో రికార్డులను బద్దలు కొట్టింది. ఇటీవలే వన్డేల్లో వరుసగా ఏడు అర్ధ సెంచరీలు చేసిన తొలి క్రికెటర్గా మిథాలీ రికార్డు సృష్టించింది.

15 ఏళ్లు పాటు 40కిపైగా యావరేజి
వన్డే అరంగేట్రం చేసిన తర్వాత వరుసగా 15 ఏళ్లు పాటు మిథాలీ యావరేజి 40కి పైగా ఉండటం విశేషం. సచిన్ కూడా సరిగ్గా ఇన్నేళ్ల పాటు 40కి పైగా యావరేజితో పరుగులు చేయడం విశేషం. 2008-12 మధ్యలో ఐదేళ్లు మినహాయిస్తే 2004 నుంచి భారత మహిళల జట్టుకి మిథాలీ కెప్టెన్గా కొనసాగుతోంది.

105 వన్డేలకు కెప్టెన్గా మిథాలీ
105 వన్డేలకు మిథాలీ కెప్టెన్గా బాధ్యతలు నిర్వహించింది. త్వరలోనే కెప్టెన్గా ఎడ్వర్డ్స్ పేరిట ఉన్న 117 వన్డేల రికార్డును కూడా మిథాలీ అధిగమించే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే మిథాలీ కెప్టెన్గా ఉన్న సమయంలో భారత్ 61 శాతం మ్యాచ్లు గెలవగా, ప్లేయర్గా కేవలం 53 శాతమే గెలవడం విశేషం.


Click it and Unblock the Notifications











