హైదరాబాద్: మహిళల టీ20 ఆసియాకప్ను భారత్ ఘనంగా ఆరంభించింది. బ్యాటింగ్, బౌలింగ్లో ప్రత్యర్థులను చెడుగుడు ఆడుతూ భారీ విజయాన్ని అందుకుంది. హైదరాబాద్ అమ్మాయి మిథాలీ రాజ్ 69 బంతుల్లో (13 ఫోర్లు, 1 సిక్స్)లతో కలిపి 97 నాటౌట్గా మెరుపులు మెరిపించడంతో.. ఆదివారం జరిగిన తొలి మ్యాచ్లో టీమిండియా 142 పరుగుల భారీ తేడాతో మలేసియాను చిత్తు చేసింది.
టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన భారత్ 20 ఓవర్లలో 3 వికెట్లకు 169 పరుగులు చేసింది. 35 పరుగులకే మందన (2), వస్ట్రార్కర్ (16) ఔటైనా.. మిథాలీ బ్యాటింగ్ ఇన్నింగ్స్కు వెన్నెముకగా నిలిచింది. పసలేని ప్రత్యర్థుల బౌలింగ్ను తుత్తునీయలు చేస్తూ పరుగుల వరద పారించింది. హర్మన్ప్రీత్తో కలిసి జట్టును భారీ స్కోరు దిశగా నడిపించిన మిథాలీ కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పింది.చివర్లో దీప్తి శర్మ (18) నాటౌట్ కూడా చెలరేగడంతో నాలుగో వికెట్కు అజేయంగా 48 పరుగులు జతయ్యాయి.
170 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన మలేసియా భారత బౌలర్ల ధాటికి 13.4 ఓవర్లలో 27 పరుగులకే కుప్పకూలింది. షషా అజ్మి (9) టాప్ స్కోరర్. టీమ్ఇండియా బౌలర్ల దాటికి మలేసియా బ్యాట్స్వుమన్ పెవిలియన్కు క్యూ కట్టారు. ఆరుగురు డకౌట్ కాగా, ఐదుగురు మాత్రమే పరుగులు చేశారు. ఇన్నింగ్స్ మొత్తంలో ఒక్కరు కూడా డబుల్ డిజిట్ స్కోరు అందుకోలేకపోయారు.
పూజ వస్త్రాకర్ ఆరు పరుగులిచ్చి మూడు వికెట్లు పడగొట్టగా.. అనుజ పాటిల్, పూనమ్ యాదవ్లు ఒక్క పరుగు కూడా ఇవ్వకుండా చెరో రెండు వికెట్లు తీసుకున్నారు. మలేసియా జట్టు 5 ఓవర్లలోనే సగం వికెట్లు కోల్పోయింది. ఒక్కరూ రెండంకెల స్కోరు చేరుకోలేదు. షాషా అజ్మి (9) టాప్ స్కోరర్. మిథాలీకి మ్యాన్ ఆఫ్ ద ప్లేయర్ అవార్డు లభించింది. ఈ టోర్నీలో పాకిస్థాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, థాయ్లాండ్ జట్లూ ఆడుతున్నాయి.