న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

టీ20 లీగ్‌లో విచిత్రం: 8 పరుగులకే ఆలౌట్, 8 మంది డకౌట్

Womens cricket under-19 t20 league: Sikkim 8 all out

హైదరాబాద్: భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) ఆధ్వర్యంలో నిర్వహిస్తోన్న మహిళల టీ20 అండర్-19 టోర్నీలో విచిత్రపు సంఘటన చోటు చేసుకుంది. ఈ సంఘటనకు గుంటురూలోని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ మహిళల అకాడమీ వేదికైంది.

<strong>ఛాన్స్ దొరికితే ధోనిలాగా మారిపోతా: పాక్ మాజీ కెప్టెన్ (వీడియో)</strong>ఛాన్స్ దొరికితే ధోనిలాగా మారిపోతా: పాక్ మాజీ కెప్టెన్ (వీడియో)

టోర్నీలో భాగంగా మంగళవారం గుంటూరులోని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ మహిళల అకాడమీలో ఆంధ్ర-సిక్కిం జట్లు తలపడ్డాయి. ఆంధ్రా జట్టుతో జరిగిన మ్యాచ్‌లో సిక్కిం జట్టు కేవలం 8 పరుగులకే ఆలౌటైంది. సిక్కిం జట్టులో 8 మంది డకౌట్‌ కావడం గమనార్హం.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆంధ్ర జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 207 పరుగులు చేసింది. అనంతరం పేసర్‌ సాయిలక్ష్మి (5/6), సింధుజ (3/1)ల ధాటికి సిక్కిం జట్టు తేలిపోయింది. ఈ మ్యాచ్‌లో సాయిలక్ష్మి ఒకే ఓవర్లో 4 వికెట్లు తీయడం విశేషం.

సిక్కిం జట్టులో ప్రీతిక (5), అర్చన (1) మాత్రమే పరుగుల ఖాతా తెరిచారు. అదనంగా మరో 2 పరుగులు వచ్చాయి. ఫలితంగా సిక్కిం జట్టు మొత్తం 8 పరుగులు చేసింది. దీంతో 199 పరుగుల తేడాతో ఆంధ్ర జట్టు రికార్డు విజయాన్ని నమోదు చేసి తర్వాతి రౌండ్‌కు అర్హత సాధించింది. గతేడాది ఇదే మైదానంలో అండర్‌-19 టోర్నీలో నాగాలాండ్‌ను కేరళ 2 పరుగులకే ఆలౌట్‌ చేసిన సంగతి తెలిసిందే.

Story first published: Wednesday, October 24, 2018, 12:51 [IST]
Other articles published on Oct 24, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X