
ఆఖరి వరకు ఆర్సీబీతోనే:
ఇన్స్టాగ్రామ్ లైవ్ సందర్భంగా విరాట్ కోహ్లీ మాట్లాడుతూ... 'ఆర్సీబీతో ప్రయాణం ఓ అద్భుతం. ఐపీఎల్ కప్ను సాధించడం మా కల. అయితే సీజన్లో మెరుగ్గా రాణించలేకపోయామనే బాధ ఉండొచ్చు. కానీ.. బెంగళూరు నుంచి వెళ్లిపోయే ఆలోచన అస్సలు లేదు. ఈ జట్టును ఎప్పటికీ వదిలి వెళ్లను. అభిమానులు, వారి విధేయత ఎంతో గొప్పగా ఉంటుంది. అభిమానులు చూపే ప్రేమ ఎప్పటికీ మరచిపోను' అని అన్నాడు. ఐపీఎల్లోకి వచ్చే యువకులు పరుగుల వరద పారించాలని కోహ్లీ సూచించాడు.

డివిలియర్స్ కూడా:
గత తొమ్మిదేళ్లగా జట్టులో ఉంటున్న డివిలియర్స్ కూడా ఆర్సీబీని వీడనని తెలిపాడు. 'నేను కూడా కోహ్లీ లాగే. ఆర్సీబీని ఎప్పటికీ విడిచిపెట్టి వెళ్లను. పరుగులు సాధిస్తూనే ఉంటాను. ఈ ప్రయాణం అద్బుతంగా ఉంది' అని మిస్టర్ 360 అన్నాడు. దక్షిణాఫ్రికా మాజీలు గ్యారీ క్రిస్టన్, డంకన్ ఫ్లెచర్, మార్క్ బౌచర్ తనకు సహాయం చేశారని విరాట్ కోహ్లీ పేర్కొన్నాడు. 'గ్యారీ ఎప్పుడూ సానుకూలంగా స్పందిచేవారు. బౌచర్ షార్ట్ బంతులను ఎదుర్కొవాలని 2008లో సూచించాడు. అతడికి గొప్ప విజన్ ఉంది. ఫ్లెచర్కు ఆటపై ఎంతో అవగాహన ఉంది. ఎంతో మంది ఆటగాళ్లు నా ఆటను మెరుగుపర్చుకోవడంలో సహాయపడ్డారు' అని కోహ్లీ పేర్కొన్నాడు.

క్రెడిట్ మొత్తం అనుష్కదే:
ఇటీవల ఆన్లైన్ సెషన్లో విరాట్ కోహ్లీ మాట్లాడుతూ... 'నిజాయతీగా చెప్పాలంటే అనుష్క శర్మతో పరిచయం నాలో చాలా మార్పులకు కారణమైంది. గతంలో నేను ప్రతీ చిన్న విషయానికి కొప్పడేవాడిని. తీవ్ర అసహనానికి గురయ్యేవాడిని. ఇప్పుడు ఆ ధోరణి మారింది. అనుష్క నాలో శాంతన్ని నింపిందనుకుంటా. అనుష్క వ్యక్తిత్వం, ఎలాంటి పరిస్థితులలో ఉన్నా ఆమె ప్రశాంతంగా ఉండడం నిజంగా నన్ను ప్రేరేపించింది' అని తెలిపాడు. విరుష్క జోడీ 2013లో ఓ షాంపూ ప్రకటన కోసం చేసిన చిత్రీకరణలో మొదటిసారి కలుసుకున్నారు.


Click it and Unblock the Notifications












