
విరాట్ కోహ్లీ అపారమైన అనుభవం ఒత్తిడి పరిస్థితులను ఎదుర్కోవడంలో సహాయపడుతుంది వికెట్ కీపర్ రిషబ్ పంత్ చెప్పాడు." కోహ్లీ వాస్తవానికి పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలో మీకు నేర్పించగలడు.ఇది మా క్రికెట్ ప్రయాణం ముందుకు సాగడంలో మీకు సహాయపడవచ్చు" అని పంత్ పేర్కొన్నాడు. "చాలా అనుభవం ఉన్న వ్యక్తి మీతో పాటు బ్యాటింగ్ చేయడం మంచిది, ఎందుకంటే అతను ఆటను ఎలా ఆడాలి, ఆ రన్-ఎ-బాల్ ఒత్తిడిని ఎలా కొనసాగించాలి అనే దాని గురించి అతను మిమ్మల్ని తీసుకెళ్లగలడు" అని వివరించాడు.
పాకిస్థాన్
దాయాది దేశం పాకిస్థాన్ తో ఆడడం తమకు మాత్రమే కాదు అభిమానులకు ప్రత్యేకమన్నారు. మైదానంలోకి అడుగుపెట్టగానే ఆ కోలాహలం అంతా మరో స్థాయిలో ఉంటుంది. అందుకే పాక్తో ఆట ఎప్పుడూ ప్రత్యేకంగానే అనిపిస్తుందని చెప్పాడు. "ఇది భిన్నమైన వాతావరణం, మేము మా జాతీయ గీతాన్ని ఆలపిస్తున్నప్పుడు, నేను నిజంగా గూస్బంప్లను పొందుతాను" అని పంత్ వివరించాడు.
ఒకే ఓవర్లో రెండు సిక్స్ లు
గతేడాది టీ20 ప్రపంచకప్ టోర్నీలో భారత్ - పాక్ మ్యాచ్ను ప్రస్తావించిన పంత్.. ఆ మ్యాచ్లో హసన్ అలీ బౌలింగ్లో తను ఒకే ఓవర్లో రెండు సిక్సర్లు కొట్టినట్లు గుర్తు చేసుకున్నాడు. కాగా టీ20 వరల్డ్ కప్ సూపర్-12లో భాగంగా భారత్ 23న పాకిస్థాన్ తో తలపడనుంది.