
అబుదాబి: టీ20 ప్రపంచకప్ 2021 సూపర్ 12లో భాగంగా అబుదాబి వేదికగా మరో కొద్దిసేపట్లో శ్రీలంక, వెస్టిండీస్ మధ్య మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచులో టాస్ గెలిచిన వెస్టిండీస్ కెప్టెన్ కీరన్ పొలార్డ్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దీంతో శ్రీలంక ముందు బ్యాటింగ్కు దిగనుంది. వెస్టిండీస్ టీమ్లో ఎటువంటి మార్పు లేదని పొలార్డ్ తెలిపాడు. మరోవైపు శ్రీలంక జట్టులో ఒక మార్పు చోటు చేసుకుందని ఆ జట్టు సారథి దాసున్ శనక పేర్కొన్నాడు. లాహిరు కుమార స్థానంలో బినుర ఫెర్నాండోను లంక తుది జట్టులోకి తీసుకుంది.
శ్రీలంక, వెస్టిండీస్ జట్ల మధ్య మ్యాచ్ అబుధాబిలోని షేక్ జయేద్ స్టేడియంలో జరగనుంది. సాయంత్రం 7:30 గంటలకు ఈ మ్యాచ్ ఆరంభమౌతుంది. రెండు జట్లకూ ఈ మ్యాచ్ అగ్నిపరీక్ష లాంటిది. ఓడిన జట్లు ఇంటిదారి పట్టాల్సి ఉంటుంది. నాలుగు మ్యాచ్లల్లో ఒకదాంట్లో మాత్రమే గెలిచిన శ్రీలంక.. మూడు మ్యాచ్లల్లో ఒక దాంట్లోనే నెగ్గిన విండీస్ తలపనున్నాయి. శ్రీలంకతో సహా మరో మ్యాచ్ ఆడాల్సి ఉంది విండీస్. ఈ రెండింట్లోనూ భారీ తేడాతో గెలిస్తే.. తప్ప టోర్నమెంట్లో ముందకు వెళ్లలేని పరిస్థితి. శ్రీలంక జట్టు పరిస్థితి బాగుందనుకోవడానికీ ఏ మాత్రం వీల్లేదు. వెస్టిండీస్కు భిన్నంగా ఏమీ ఉండట్లేదు.
తుది జట్లు:
వెస్టిండీస్: క్రిస్ గేల్, ఎవిన్ లీవిస్, రోస్టన్ చేజ్, నికోలస్ పూరన్ (వికెట్ కీపర్), సిమ్రోన్ హెట్మైర్, కైరోన్ పొలార్డ్ (కెప్టెన్), ఆండ్రీ రసెల్, జసన్ హోల్డర్, డ్వేన్ బ్రావో, అకీల్ హోసీన్, రవి రాంపాల్.
శ్రీలంక: పాథమ్ నిస్సాంక, కుశాల్ పెరీరా (వికెట్ కీపర్), చరిత్ అసలంక, అవిష్క ఫెర్నాండో, భానుకా రాజపక్సా, దాసున్ శనక (కెప్టెన్), చమిక కరుణరత్నే, వానిండు హసరంగ, దుష్మంత చమీరా, మహీశ్ తీక్షణ, బినురా ఫెర్నాండో.