
హైదరాబాద్: పీఎల్ 2018 వేలం ప్రారంభమైంది. బెంగళూరులోని ఐటీసీ గార్డెనియా వేదికగా ఈ వేలం ప్రారంభమైంది. వేలంలో వెయ్యికి పైగా ఆటగాళ్లు తమ పేర్లను నమోదు చేసుకున్నప్పటికీ బీసీసీఐ మాత్రం 578 ప్లేయర్లకు మాత్రమే అనుమతినిచ్చింది. ప్రపంచంలోనే క్యాష్ రిచ్ లీగ్ టోర్నీగా పేరుగాంచిన ఐపీఎల్ ట్రోఫీని సొంతం చేసుకునేందుకు ఎనిమిది ఫ్రాంఛైజీలు అత్యుత్తమ జట్టుని తయారు చేసుకునేందుకు గాను వేలం ప్రక్రియ ఎంతో ముఖ్యం.
ఐపీఎల్ వేలానికి సంబంధించిన పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
వేలంలో వచ్చిన మొదటి ఆటగాడు శిఖర్ ధావన్. ఆ తర్వాత వచ్చిన రవిచంద్రన్ అశ్విన్ పంజాబ్ జట్టుకు దక్కాడు. స్థానికత కోసం చెన్నై సూపర్ కింగ్స్ అశ్విన్ను తీసుకుంటామని ప్రమోషన్లో భాగంగా చెప్పినా మాటను నిలబెట్టుకోలేకపోయింది.
వెస్టిండీస్ ఆటగాడు క్రిస్ గేల్ను కొనుగోలు చేసుకునేందుకు ఏ ఒక్క ఫ్రాంఛైజీ ఆసక్తి చూపకపోవడం గమనార్హం. ఇప్పటి వరకు వేలంలో అమ్ముడపోయిన వాళ్ల జాబితాలో బెన్ స్టోక్స్ కోసం రాజస్థాన్ రూ.12.5 కోట్లు వెచ్చించింది. అతనే అత్యధిక ధరతో కొనసాగుతున్నాడు.
క్రిస్ గేల్తో పాటుగా జో రూట్:
ఇంగ్లాండ్ క్రికెట్ జట్టు టెస్టు కెప్టెన్ జో రూట్ను కూడా ఏ ఫ్రాంచైజీ ముందుకు రాలేదు. క్రిస్ గేల్తో పాటుగా కొనుగోలు కానీ, జాబితాలో రెండో స్థానంలో జో రూట్ ఉన్నాడు.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్లో ఫాలో అవ్వండి.