
2015లో జింబాబ్వేపై ధోనీ
2015లో జింబాబ్వేపై విజయవంతమైన రన్-ఛేజింగ్లో ఎంఎస్ ధోనీ 7వ స్థానంలో బరిలోకి దిగి 3 సిక్సర్లు కొట్టాడు. యూసుఫ్ పఠాన్ విజయవంతమైన రన్-ఛేజింగ్లలో రెండు సందర్భాలలో 3సిక్సర్లు కొట్టాడు. 2011లో దక్షిణాఫ్రికాపై, ఐర్లాండ్పై అతను ఈ ఫీట్ సాధించాడు. ఇక ఛేదనలో సంజూ శాంసన్, శ్రేయాస్ అయ్యర్ మిడిలార్డర్లో హాఫ్ సెంచరీలు బాది మ్యాచ్ మూమెంటమ్ మార్చేశారు. అయితే వీరిద్దరూ ఔటయిపోవడంతో మ్యాచ్ కాస్త చేజారేలా కన్పించింది. దీపక్ హుడా సైతం 33పరుగుల వద్ద 45వ ఓవర్లో ఔటవ్వడంతో ఇక ఇండియాకు ఓటమి లాంఛనమే అనిపించింది. అయితే టెయిలండర్లతో కలిసి అక్షర్ పటేల్ వీరోచితంగా పోరాడాడు. తద్వారా భారత్ ఫినిషింగ్ లైన్ దాటి విజయం సొంంతం చేసుకుంది. ఇక ఈ విజయంతో 2-0తేడాతో సిరీస్ సైతం భారత్ వశమైంది.

అయిదేళ్ల తర్వాత తొలిసారిగా వన్డే మ్యాచ్
ఇక మ్యాచ్ అనంతరం అక్షర్ పటేల్ స్పందించాడు. ప్రత్యేకించి వన్డే క్రికెట్లో మ్యాచ్ విన్నింగ్ కంట్రిబ్యూషన్ తన నుంచి రావాలని ఆశించానని అక్షర్ చెప్పాడు. 2017తర్వాత మరోసారి వెస్టిండీస్ సిరీస్కు ఎంపికైన ఈ గుజరాతీ ఆల్రౌండర్ అయిదేళ్ల తర్వాత తొలిసారి వన్డే సిరీస్ ఆడుతున్నాడు. ఇక తొలి మ్యాచ్లోనూ భారత్ 3పరుగుల తేడాతో గెలుపొందగా.. చివర్లో అక్షర్ కీలకమైన 21పరుగులు చేశాడు.

ఆ భావనే చాలా గొప్పగా ఉంది
'ఇది ఒక ప్రత్యేక సందర్భమని నేను భావిస్తున్నాను. ఇలాంటి కీలక సమయంలో నేను ఇంత బాగా ఆడడం సంతోషాన్నిస్తుంది. తద్వారా మా టీం మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ గెలిచింది. నా ఇన్నింగ్స్ జట్టు విజయానికి సహాయపడిందనే భావనే చాలా గొప్పగా అనిపిస్తుంది. మేము ఐపీఎల్లో కూడా ఇలాంటి సిచువేషన్లు ఎదుర్కొన్నాము. ప్రశాంతంగా ఉండి మ్యాచ్ ఇంటెన్సిటీని కొనసాగించాలనుకున్నా. నేను ఆడగలను అని నమ్మాను. దాదాపు 5 ఏళ్ల తర్వాత వన్డే ఆడడం.. పైగా జట్టు కోసం ఇలాంటి అద్భుత ప్రదర్శన చేయగలగడం బాగుంది. ఇలాంటి ఆటనే కొనసాగించాలనుకుంటున్నాను' అని అక్షర్ పేర్కొన్నాడు.


Click it and Unblock the Notifications












