
ఫ్రాంచైజీల కఠిన నిర్ణయాలు
వచ్చే నెలలో జరిగే ఐపీఎల్ మినీ వేలానికి ముందు అన్ని జట్లు కూడా తాము రిటైన్ చేసుకుంటున్న ఆటగాళ్లు, రిలీజ్ చేస్తున్న ప్లేయర్ల జాబితాను విడుదల చేశాయి. ఈ క్రమంలో గతేడాది భారీ ధరకు కొనుగోలు చేసిన ఆటగాళ్లను కూడా ఆయా ఫ్రాంచైజీలు నిర్దాక్షిణ్యంగా వదిలేశాయి. ముంబై ఇండియన్స్, సన్రైజర్స్ హైదరాబాద్ వంటి జట్లు కొందరు కీలకమైన ఆటగాళ్లను రిలీజ్ చేసేశాయి. డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్తోపాటు రన్నరప్ రాజస్థాన్ రాయల్స్ తదితర జట్లు కూడా చాలా మంది ఆటగాళ్లను వదిలించుకున్నాయి.

భారీగా వదిలేసిన జట్లు
ఇలా మినీ వేలానికి ముందు ఎక్కువ మంది ఆటగాళ్లను వదిలించుకున్న జట్టు ఏదో తెలుసా? గతేడాది మ్యాచ్, మ్యాచ్కూ టీంలో మార్పులు చేసి, ఆ కారణంగానే చతికిలపడిన కోల్కతా నైట్ రైడర్స్. ఈ సారి కేకేఆర్ జట్టు ఏకంగా 16 మంది ఆటగాళ్లను రిలీజ్ చేసేసింది. తాము భవిష్యత్తు కోసం జట్టును సిద్ధం చేస్తున్నామని గతేడాదే సంకేతాలు పంపిన ఆ జట్టు.. అదే బాటలో నడుస్తూ కఠిన నిర్ణయం తీసుకుంది.

తర్వాతి స్థానాల్లో ఎవరున్నారంటే?
కేకేఆర్ తర్వాత అంత భారీ సంఖ్యలో ఆటగాళ్లను వదిలించుకున్న జట్టు ముంబై ఇండియన్స్. వెటరన్ కీరన్ పొలార్డ్ను కూడా రిలీజ్ చేసిన ఆ జట్టు మొత్తమ్మీద 13 మంది ఆటగాళ్లను వదులుకుంది. కెప్టెన్ కేన్ విలియమ్సన్. నికోలస్ పూరన్ సహా సన్రైజర్స్ జట్టు 12 మందిని వదిలేసింది. పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు చెరో 9 మంది ఆటగాళ్లను వదిలించుకున్నాయి. చెన్నై 8 మందిని, లక్నో ఏడుగురిని, గుజరాత్ ఆరుగురిని రిలీజ్ చేశాయి. ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు చెరో ఐదుగురు ఆటగాళ్లను వదిలించుకున్నాయి.


Click it and Unblock the Notifications












