NO.4 స్థానం కోసం
ప్రపంచకప్ మొదలైంది. ఓపెనర్లుగా రోహిత్ శర్మ, శిఖర్ ధావన్లు ఉండటంతో NO.4 స్థానం కోసం కేఎల్ రాహుల్, విజయ్ శంకర్ల మధ్య గట్టి పోటీ నడించింది. చివరికు కేఎల్ రాహులే ముందుగా ఆ స్థానంలో బ్యాటింగ్ చేశాడు. ఆ తర్వాత ఓపెనర్ శిఖర్ ధావన్ గాయం కారణంగా టోర్నీ నుంచి తప్పుకోవడంతో రాహుల్ని ఓపెనర్గా కుదురుకున్నాడు.
నిరాశపరిచిన విజయ్ శంకర్
దీంతో NO.4 స్థానం విజయ్ శంకర్కు దక్కింది. అయితే విజయ్ శంకర్ కూడా ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. ప్రాక్టీస్ సెషన్లో బుమ్రా వేసిన బంతికి విజయ్ శంకర్ గాయపడటం.. ప్రపంచకప్ టోర్నీ నుంచి తప్పుకోవడంతో అతడి స్థానంలో రిషబ్ పంత్ని క్రీజులోకి దింపారు. అయితే, పంత్ కూడా తనను తాను నిరూపించుకోలేకపోయాడు.
ఆగస్టు 3 నుంచి విండిస్ పర్యటన ప్రారంభం
విండిస్ పర్యటనలో భాగంగా టీమిండియా 3 టీ20లు, 3 వన్డేలు, రెండు టెస్టులు ఆడనుంది. ఆగస్టు 3న జరిగే తొలి టీ20తో వెస్టిండిస్ పర్యటన ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో మరోసారి నెం.4 స్థానంపై చర్చ తెరమీదకు వచ్చింది. ఈసారి సెలక్టర్లు ఈ స్థానంలో యువ క్రికెటర్లను పరీక్షించాలనుకున్నట్లు సమాచారం. ఇందులో భాగంగా ఈ స్ధానంలో శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్, శుభ్మాన్ గిల్ల పేర్లు వినిపిస్తున్నాయి. మరి, వీరిలో ఎవరు రాణిస్తారో చూడాలి.