ముంబై: భారత క్రికెట్ టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రస్తుతం మంచి ఫాంలో ఉన్నాడు. ఇటీవలే ముగిసిన ఐపీఎల్ 9 ఎడిషన్లో అద్భుతంగా రాణించాడు. టాప్ స్కోరర్గా నిలిచాడు. 16 మ్యాచులలో 973 పరుగులతో కోహ్లీ ఆరెంజ్ క్యాప్ సొంతం చేసుకున్నాడు.
త్వరలో బాలీవుడ్ నుంచి 'డిష్యూం' అనే చిత్రం రాబోతుంది. దీనికి దర్శకులు రోహిత్ ధావన్. ఈ సినిమాలో ఢిల్లీ బ్యాట్సుమెన్ విరాట్ కోహ్లీ కిడ్నాప్ అయితే అనే అంశం ఉంటుంది.. పాకిస్తాన్ - భారత్ మధ్య ఉత్కంఠభరిత మ్యాచ్ ప్రారంభానికి ముందు కోహ్లీ కిడ్నాప్ అయ్యే కథాంశంతో చిత్రాన్ని తీస్తున్నారు.
చిరకాల ప్రత్యర్థులు భారత - పాకిస్థాన్ మధ్య కాసేపట్లో క్రికెట్ పోటీ ప్రారంభం కానుంది. స్టేడియమంతా ప్రేక్షకులతో నిండిపోయింది. అభిమానులు కేకలు, అరుపులతో దద్దరిల్లుతోంది. ఆ సమయంలో జట్టులో ఆడుతున్న ఢిల్లీకి చెందిన కీలక ఆటగాడు కిడ్నాప్ అయితే... ఈ కథాంశంతో దర్శకుడు రోహిత్ ధావన్ రూపొందిస్తున్నారు ఈ చిత్రాన్ని.
ఇందులో కోహ్లీ పాత్రలో సఖీబ్ సలీమ్ నటిస్తున్నాడు. చిత్రంలో అతని పాత్ర పేరు విరాజ్. మ్యాచ్కి నిమిషాల ముందు కిడ్నాపైన పాత్రలో సలీమ్, ఇతర ముఖ్యపాత్రల్లో జాన్ అబ్రహాం, వరుణ్ ధావన్, జాక్వలిన్ ఫెర్నాండెజ్, రాహుల్ ఖన్నాలు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ట్రయిలర్ విడుదలైంది.