న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

భారత్-పాక్ మ్యాచ్: కోహ్లీ కిడ్నాప్ అయితే!(వీడియో)

By Srinivas

ముంబై: భారత క్రికెట్ టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రస్తుతం మంచి ఫాంలో ఉన్నాడు. ఇటీవలే ముగిసిన ఐపీఎల్ 9 ఎడిషన్లో అద్భుతంగా రాణించాడు. టాప్ స్కోరర్‌గా నిలిచాడు. 16 మ్యాచులలో 973 పరుగులతో కోహ్లీ ఆరెంజ్ క్యాప్ సొంతం చేసుకున్నాడు.

త్వరలో బాలీవుడ్ నుంచి 'డిష్యూం' అనే చిత్రం రాబోతుంది. దీనికి దర్శకులు రోహిత్ ధావన్. ఈ సినిమాలో ఢిల్లీ బ్యాట్సుమెన్ విరాట్ కోహ్లీ కిడ్నాప్ అయితే అనే అంశం ఉంటుంది.. పాకిస్తాన్ - భారత్ మధ్య ఉత్కంఠభరిత మ్యాచ్ ప్రారంభానికి ముందు కోహ్లీ కిడ్నాప్ అయ్యే కథాంశంతో చిత్రాన్ని తీస్తున్నారు.

When Virat Kohli was kidnapped minutes before India-Pakistan match...

చిరకాల ప్రత్యర్థులు భారత - పాకిస్థాన్ మధ్య కాసేపట్లో క్రికెట్ పోటీ ప్రారంభం కానుంది. స్టేడియమంతా ప్రేక్షకులతో నిండిపోయింది. అభిమానులు కేకలు, అరుపులతో దద్దరిల్లుతోంది. ఆ సమయంలో జట్టులో ఆడుతున్న ఢిల్లీకి చెందిన కీలక ఆటగాడు కిడ్నాప్ అయితే... ఈ కథాంశంతో దర్శకుడు రోహిత్ ధావన్ రూపొందిస్తున్నారు ఈ చిత్రాన్ని.

ఇందులో కోహ్లీ పాత్రలో సఖీబ్ సలీమ్ నటిస్తున్నాడు. చిత్రంలో అతని పాత్ర పేరు విరాజ్. మ్యాచ్‌కి నిమిషాల ముందు కిడ్నాపైన పాత్రలో సలీమ్, ఇతర ముఖ్యపాత్రల్లో జాన్ అబ్రహాం, వరుణ్ ధావన్, జాక్వలిన్ ఫెర్నాండెజ్, రాహుల్ ఖన్నాలు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ట్రయిలర్ విడుదలైంది.

Story first published: Monday, November 13, 2017, 12:12 [IST]
Other articles published on Nov 13, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X