1996 వరల్డ్కప్ సెమీఫైనల్ మ్యాచ్లో
1996 వరల్డ్కప్ సెమీఫైనల్ మ్యాచ్కి కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ స్టేడియం ఆతిథ్యమిచ్చింది. సొంతగడ్డపై మరోసారి కప్ను చేజిక్కించుకోవాలన్న కసిమీద ఉన్న టీమిండియా అందుకు తగ్గట్లే సెమీఫైనల్కు చేరింది. శ్రీలంకతో జరిగిన ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన భారత కెప్టెన్ అజహరుద్దీన్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు.
35 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన లంక
దీంతో బ్యాటింగ్కు దిగిన శ్రీలంక 35 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత అరవింద డిసిల్వా, మహానామా హాఫ్ సెంచరీలతో చెలరేగడంతో చివరకు శ్రీలంక 251 పరుగులు చేసింది. తక్కువ స్కోరే కావడంతో టీమిండియానే విజయం సాధిస్తుందని అంతా భావించారు. ఆరంభంలో సిద్ధు వెనుదిరిగినా మంజ్రేకర్తో కలిసి సచిన్ ఇన్నింగ్స్ను ముందుకు నడిపించాడు.
వరుసగా వికెట్లను కోల్పోయిన సచిన్
అయితే, సచిన్ ఔటయ్యాక టీమిండియా వరుసగా వికెట్లను కోల్పోయింది. సచిన్ ఔటైన తర్వాత అజహరుద్దీన్, అజయ్ జడేజా, నయన్ మోంగియా వెంటవెంటనే పెవిలియన్కు చేరారు. దీంతో భారత్ 120 పరుగులకే 8 వికెట్లు కోల్పోయింది. దీంతో స్టేడియంలోని ప్రేక్షకులు ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేశారు.
స్టాండ్స్లోని సీట్లకు నిప్పుపెట్టిన అభిమానులు
భారత్ ఓటమి ఖాయం కావడంతో జీర్ణించుకోలేకపోయిన అభిమానులు మ్యాచ్ను అడ్డుకున్నారు. ముందు వాటర్ బాటిల్స్ను గ్రౌండ్లోకి విసిరి నిరసన తెలిపిన ప్రేక్షకులు ఆ తర్వాత మరింతగా రెచ్చిపోయి.. స్టాండ్స్లోని సీట్లకు సైతం నిప్పుపెట్టారు. దీంతో ఆ స్కోరు వద్ద నిర్వాహకులు శ్రీలంకను విజేతగా ప్రకటించారు. పైనల్లో అద్భుత ప్రదర్శన చేసిన శ్రీలంక వరల్డ్కప్ ఛాంపియన్గా నిలిచింది.