సచిన్ను ప్రశ్నలడిగిన వీవీఎస్ లక్ష్మణ్
ఈ సందర్భంగా సచిన్ను వీవీఎస్ లక్ష్మణ్ కొన్ని ప్రశ్నలు అడిగాడు. ఈ ఇంటర్యూలో కోకకోలా కప్-1998లో భాగంగా షార్జా వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన పలు విషయాలను విషయాలను ప్రస్తావించారు. ఈ సందర్బంగా సచిన్ మ్యాచ్ మధ్యలో లక్ష్మణ్పై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిపాడు.
|
లక్ష్మణ్కు అప్పుడే క్షమాపణలు చెప్పా
ఇంటికెళ్లాక తన సోదరుడితో తిట్లు తిన్నానని 'అతను నీ సహచర ఆటగాడు. అతను నీకు మద్దతునిస్తే.. నువ్వు అతనిపై అరిచావు' అని తన సోదరుడు మందలించినట్లు సచిన్ ఆనాటి విషయాలను గుర్తు చేసుకున్నాడు. అయితే ఈ ఘటనపై లక్ష్మణ్కు అప్పుడే క్షమాపణలు చెప్పానని, మళ్లీ మైదానంలో ఎప్పుడూ ఇలా ప్రవర్తించలేదని సచిన్ అన్నాడు.
వాంఖడే మైదానం ఎంతో ప్రత్యేకం
ముంబై వాంఖడే మైదానం తనకు ప్రత్యేకమని సచిన్ అన్నాడు. 'ఈ మైదానం నాకు ప్రత్యేకం. నేనిక్కడి నుంచే నా ఆటను ప్రారంభించా. ఫ్టస్ట్ క్లాస్ క్రికెట్లోకి ఇక్కడే అరంగేట్రం చేశా. 2011 ప్రపంచకప్ ఇక్కడే గెలిచాం. నా వీడ్కోలు మ్యాచ్ సైతం ఈ మైదానంలోనే జరిగింది. అందుకే వాంఖేడే నా జీవితంలో ప్రత్యేకమైన మైదానం' అని సచిన్ తెలిపాడు.
నాన్ స్ట్రైకర్గా సచిన్ ఇన్నింగ్స్ చూడటం అదృష్టం
ఆ తర్వాత వీవీఎస్ లక్ష్మణ్ మాట్లాడుతూ నాన్ స్ట్రైకర్గా సచిన్ సూపర్ ఇన్నింగ్స్ చూడటం తన అదృష్టమని చెప్పుకొచ్చాడు. 'ఇది క్రికెట్లోనే ఓ అద్భుతమైన ఇన్నింగ్స్' అని వీవీఎస్ లక్ష్మణ్ తెలిపాడు. ఈ మ్యాచ్లో సచిన్(143) సెంచరీ చేసిన భారత్ 16 పరుగుల తేడాతో పరాజయం పాలైంది.