For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కోహ్లీ తొలి సెంచరీకి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ఇప్పించిన గౌతం గంభీర్

When Gautam Gambhir handed his Man of the Match trophy to a young Virat Kohli

న్యూ ఢిల్లీ: టీమిండియా మాజీ క్రికెటర్ గౌతం గంభీర్.. యువ ఆటగాళ్లను ప్రోత్సహించడంలో ఎప్పుడూ ముందుంటాడు. అది ఐపీఎల్ ఫార్మాట్ అయినా.. టీమిండియా మ్యాచ్‌లు అయినా తన చేతిలో ఉన్నంతవరకూ దన్నుగా నిలిచేవాడు. రెండేళ్లుగా భారత్ జట్టుకి దూరమై దేశవాళీ, ఐపీఎల్‌లో మాత్రమే ఆడుతున్న గంభీర్.. మంగళవారం రాత్రి అనూహ్యంగా క్రికెట్‌కి రిటైర్మెంట్ ప్రకటించేశాడు.

చిరస్మరణీయంగా నిలిచిపోయేలా

చిరస్మరణీయంగా నిలిచిపోయేలా

సుదీర్ఘ కెరీర్‌లో తన నిరాడంబరత, మంచితనం, కచ్చితత్వంతో ఎంతో మంది అభిమానుల మనసులు గెలుచుకున్నాడు ఈ ఓపెనర్. బ్యాటింగ్‌లో మెరుపులు చూపిస్తూ తన సత్తా చాటడమే కాక, టీమిండియా స్థాయి పెరగడంలోనూ కీలకపాత్ర పోషించాడు. ఈ క్రమంలో గంభీర్ సాధించిన విజయాలు ఎప్పటికీ చిరస్మరణీయంగా నిలిచిపోవాల్సిందే. ఈ నేపథ్యంలో గౌతమ్ గంభీర్ ఔదార్యానికి 2009లో శ్రీలంకతో జరిగిన ఓ మ్యాచ్ నిదర్శనంగా నిలిచింది.

316 పరుగుల భారీ లక్ష్యాన్ని చేధించడంలో

316 పరుగుల భారీ లక్ష్యాన్ని చేధించడంలో

కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన ఆ వన్డే మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక జట్టు ఉపుల్ తరంగ (118), కుమార సంగక్కర (60) దూకుడుగా ఆడారు. ఇలా నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి భారత్‌కు 316 పరుగుల భారీ లక్ష్యాన్నిచ్చింది. ఛేదనకి దిగిన భారత్‌లో.. ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ (10), స్టార్ బ్యాట్స్‌మన్ సచిన్ టెండూల్కర్ (8)లు ఆరంభంలోనే ఔటయ్యారు. దాంతో 23/2తో కష్టాల్లో పడింది.

కోహ్లీతో కలిసి అభేద్యమైన ఇన్నింగ్స్ ఆడిన గంభీర్

ఈ దశలో క్రీజులోకి వచ్చిన యువ క్రికెటర్ విరాట్ కోహ్లితో కలిసి గౌతమ్ గంభీర్ అసాధారణ ఇన్నింగ్స్ ఆడాడు. ఈ క్రమంలో ఈ జోడీ మూడో వికెట్‌కి అభేద్యంగా 224 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పగా.. విరాట్ కోహ్లి (107) కెరీర్‌లో తొలి వన్డే శతకాన్ని నమోదు చేసి ఔటయ్యాడు. కానీ.. పట్టు వదలని గంభీర్ ఆ తర్వాత వచ్చిన దినేశ్ కార్తీక్ (19)తో కలిసి 11 బంతులు మిగిలి ఉండగానే భారత్ జట్టుని విజేతగా నిలిపాడు.

‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' అవార్డును కోహ్లీకి ఇవ్వమని

ఆఖరి వరకూ క్రీజులోని నిలిచిన గౌతమ్ గంభీర్ 150 పరుగులతో నాటౌట్‌గా నిలవడంతో అతనికి ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' అవార్డు లభించింది. కానీ.. ఆ అవార్డుని తొలి సెంచరీ బాదిన విరాట్ కోహ్లీకి ఇవ్వాల్సిందిగా గౌతమ్ గంభీర్ మ్యాచ్ నిర్వాహకులకి సూచించి గొప్ప మనసు చాటుకున్నాడు. యువ క్రికెటరైన కోహ్లీకి ఆ అవార్డు ప్రోత్సాహకంగా ఉంటుందని అప్పట్లో గంభీర్ ఇచ్చినట్లుగా సమాచారం.

Story first published: Wednesday, December 5, 2018, 15:42 [IST]
Other articles published on Dec 5, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+