న్యూఢిల్లీ: వెస్టిండీస్ ఆటగాడు డ్వేన్ బ్రావో భారత ట్వంటీ 20వ, వన్డే కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ కాలర్ పట్టుకున్నాడు. అయితే అది సరదాగా మాత్రమే పట్టుకున్నాడు. గురువారం నాడు భారత్, వెస్టిండీస్ మధ్య వార్మప్ మ్యాచ్ జరిగింది.
ఈ సమయంలో ఈ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. సమాచారం మేరకు.. మ్యాచ్ అనంతరం వెస్టిండీస్ ఆల్ రౌండర్ డ్వేన్ బ్రావో భారత కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ కాలర్ పట్టుకున్నాడు.

ధోనీ, డ్వేన్ బ్రావోలు ఐపీఎల్ జట్టు చెన్నైసూపర్ కింగ్స్ (ఈ జట్టు నిషేధానికి గురైంది) ఆటగాళ్లు. దీంతో వారి మధ్య మంచి స్నేహం ఉంది. ఇందులో భాగంగా ప్రపంచ ట్వంటీ 20 కప్ వార్మప్ మ్యాచ్ అనంతరం బ్రావో.. ధోనీ కాలర్ పట్టుకొన్నాడు. ఇరువురు ఆటగాళ్లు కూడా పరస్పరం కంగ్రాట్స్ చెప్పుకున్నారు.
ఇది తమాషాకేనని చెబుతున్నారు. ఈ ప్రాక్టీస్ మ్యాచ్ ఈడెన్ గార్డెన్ మైదానంలో జరిగింది. బ్రావో.. ధోనీ కాలర్ పట్టుకోవడంపై ఓ క్షణం వీక్షకులు ఆశ్చర్యానికి గురయ్యారు. అయితే, అది తమాషాకేనని వారికి తెలియదని చెప్పవచ్చు.