
చివరి ఓవర్ను ఎవరికి ఇవ్వాలనే సందిగ్ధంలో గంగూలీ
2004లో పాకిస్థాన్తో జరిగిన మ్యాచ్లో టీమిండియా కెప్టెన్ సౌరవ్ గంగూలీ చివరి ఓవర్ను ఎవరికి ఇవ్వాలనే సందిగ్ధంలో పడ్డాడు. అప్పుడు ‘దాదా భయపడకు. నేను చూసుకుంటా' అని నెహ్రా అభయమిచ్చాడు. ఈ విషయాన్ని
నెహ్రా ఫేర్వెల్ సందర్భంగా మాజీ క్రికెటర్ బదానీ ఫేస్బుక్లో పోస్ట్ చేసిన వీడియోలో పేర్కొన్నాడు.

2004లో జరిగిన ఆ సంఘటన నాకు గుర్తుంది
'2004లో జరిగిన ఆ సంఘటన నాకు గుర్తుంది. కరాచీలో భారత్, పాకిస్థాన్ చావోరేవో అన్నట్టు తలపడుతున్నాయి. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 350 పరుగుల చేసింది. రెండో ఇన్నింగ్స్ చివరి ఓవర్లో తొమ్మిదో.. పదో పరుగులు చేస్తే పాక్ విజయం సాధిస్తుంది. అప్పుడు చివరి ఓవర్ ఎవరికివ్వాలని గంగూలీ సందిగ్ధంలో పడ్డాడు' అని తెలిపాడు.
గంగూలీ వద్దకు వచ్చిన నెహ్రా
'ఇంతలో ఫైన్ లెగ్లో ఫీల్డింగ్ చేస్తున్న నెహ్రా.. గంగూలీ వద్దకు వచ్చాడు. ‘దాదా నేను వేస్తా. నువ్వు భయపడకు. మ్యాచ్ గెలిచిపించి తీరుతా' అని అన్నాడు. చివరి ఓవర్లో నెహ్రా మూడు పరుగులిచ్చి మొయిన్ఖాన్ వికెట్ తీసి అన్నట్టే భారత్కు విజయాన్ని అందించాడు' అని బదానీ గుర్తుచేసుకున్నాడు.

5 పరుగుల తేడాతో భారత్ విజయం
ఈ మ్యాచ్లో 5 పరుగుల తేడాతో భారత జట్టు విజయం సాధించింది. నెహ్రా 10 ఓవర్లు వేసి 58 పరుగులిచ్చి ఒక వికెట్ తీశాడు. 'గంగూలీకి నువ్వు భయపడకని దాదాకే చెప్పిన వ్యక్తి. ఎన్నో గాయాలతో సానుకూలంగా పోరాడిన వీరుడు. పోరాట పటిమగలవాడైన నెహ్రాకు వీడ్కోలు తర్వాత జీవితం అద్భుతంగా ఉండాలి. నెహ్రా మీరు దేశం తరఫున ఆడి భారత జెండాను అత్యున్నత స్థాయిలో నిలిపారు' అని పేర్కొన్నాడు.


Click it and Unblock the Notifications