కోహ్లీ, రోహిత్ తో ఈ ఛాంపియన్స్ ట్రోఫీని నెగ్గడం కష్టమే అన్న వాదనలు వినిపించిన సంగతి తెలిసిందే. వీరిద్దరికి ఇదే చివరి ఛాంపియన్స్ ట్రోఫీ అన్న మాటలు కూడా వినిపించాయి. కానీ వాటిని పటాపంచ్ లు చేస్తూ.. ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో కోహ్లీ-రోహిత్ అద్భుత ప్రదర్శన చేశారు. 2027 ప్రపంచ కప్ వరకు తమ ఫిట్నెస్ కు ఏం ఢోకా లేదని, అప్పటివరకు ఆటలో కొనసాగుతామని స్పష్టం చేశారు. అయితే ఈ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ తో... కీలక ఇన్నింగ్స్ ఆడిన రోహిత్ శర్మకు, కోహ్లీకి '76' నెంబర్తో ప్రత్యేక సంబంధం ఏర్పడింది. ప్రస్తుతం ఇది క్రికెట్ వర్గాలు స్పెషల్ నెంబర్ గా నిలిచింది.
రోకో-స్పెషల్ కనెక్షన్ విత్ 76
ఒకే టీమ్ కు చెందిన ఇద్దరు స్టార్ ప్లేయర్స్ రెండు వేర్వేరు బడా మ్యాచుల్లో కీలక ఇన్నింగ్స్ ఆడి సేమ్ స్కోర్ చేయడం చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు కోహ్లీ, రోహిత్ కూడా అదే చేశారు. గత టీ20 వరల్డ్ కప్ 2024 ఫైనల్ లో విరాట్ 59 బంతుల్లో 76 కీలక పరుగులు చేసి భారత్ విజయంలో కీలకంగా వ్యవహరించిన సంగతి తెలిసిందే.

ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అందుకున్నాడు. ఇప్పుడు తాజాగా ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్ లోనూ రోహిత్ 83 బంతుల్లో ఏడు బౌండరీలు, మూడు సిక్స్ ల సాయంతో సరిగ్గా 76 కీలక పరుగులు చేసి జట్టుకు విజయాన్నందించాడు. అలా ఇద్దురు స్టార్ క్రికెటర్లు రెండు వేర్వేరు బడా ఐసీసీ ఈవెంట్స్ లో 76 పరుగులు చేసి జట్టుకు విజయాన్ని అందించడం విశేషం.
Last two ICC Finals
— Dinda Academy (@academy_dinda) March 9, 2025
2024-
India wins
Virat Kohli scored 76
Virat Kohli won the POTM
2025-
India wins
Rohit Sharma scored 76
Rohit Sharma won the POTM pic.twitter.com/wKCGqYD2DD
ఛాంపియన్స్ ట్రోఫీలో రోకో ప్రదర్శన
ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో ఫైనల్లో కీలక ఇన్నింగ్స్ ఆడిన రోహిత్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు. అలానే పాకిస్థాన్ పై అద్భుత సెంచరీ, ఆస్ట్రేలియాపై కీలక అర్ధ శతకం బాది జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించారు. దీంతో ఈ టోర్నీ ముందు వరకూ వీరిద్దరూ రిటైర్మెంట్ ప్రకటిస్తే బాగుండని చెప్పిన వారు... ఇప్పుడు భారత భవిష్యత్ క్రికెట్ కోసం కొనసాగాలని కోరుకుంటున్నారు.