హైదరాబాద్: రంజీ ట్రోఫీలో ఎవ్వరూ ఊహించలేదు విదర్భ గెలిచింది. అంచెలంచెలుగా ఎదిగి విజేతగా నిలుచుంది. కానీ, ఒకే ఒక్క వ్యక్తి మాత్రం బలంగా నమ్మాడు. ఖచ్చితంగా గెలిచి తీరుతుందన్న భరోసాను జట్టు సభ్యులకు కల్పించాడు.
Aditya Sarwate and Akshay Wadkar reflect on Vidarbha's win; speak about their role in Paytm #RanjiTrophy 2017-18 #Final #DELvVID - https://t.co/DFkvMslckd
— BCCI Domestic (@BCCIdomestic) January 2, 2018
సరిగ్గా ఇదే నమ్మకంతో క్రికెట్ సంఘం ఉపాధ్యక్షుడ్ని ఈ మ్యాచ్ గెలిస్తే ప్రైజ్ మనీ ఎంతొస్తుంది అని అడిగాడట. అంతేకాదు దానితో ఏం చేయాలి అనేది కూడా ప్రస్తావించాడట. ఈ విషయాన్ని స్వయంగా ఆ సంఘ ఉపాధ్యక్షుడైనటువంటి ప్రశాంత్ వైద్య నేరుగా మీడియాతో చెప్పి ఆనందాన్ని వెలిబుచ్చారు.
Coach Chandrakant Pandit relives the journey and gives an insight into Vidarbha's success in @Paytm #RanjiTrophy 2017-18 season - https://t.co/lBzYKbdXCP
— BCCI Domestic (@BCCIdomestic) January 1, 2018
'అతను దేని గురించి మాట్లాడుతున్నాడో అర్ధం కాలేదు. అప్పుడు మళ్లీ అడిగాడు.. రంజీ ట్రోఫీ ప్రైజ్మనీ ఎంత అని? గెలిస్తే మనం ఏం చేయాలి అన్నాడు. ఆశ్చర్యపోయాను.. అతని ఆత్మవిశ్వాసం చూసి. సీజనే ప్రారంభం కాలేదు.. అతను ట్రోఫీ గెలవడం గురించి ఆలోచించాడు. అప్పుడే విదర్భ అద్భుతం చేస్తుందని అనిపించింది' అని వైద్య చెప్పాడు.
Wasim Jaffer reflects on Vidarbha's maiden @Paytm #RanjiTrophy victory and personally being part of nine #Finals - https://t.co/fjcTnHkYCp
— BCCI Domestic (@BCCIdomestic) January 2, 2018
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్లో ఫాలో అవ్వండి.