హైదరాబాద్: సెయింట్ లూసియా వేదికగా బుధవారంతో ముగిసిన మూడో టెస్టులో వెస్టిండీస్, ఇంగ్లాండ్ జట్టు బౌలర్లు ఓ చెత్త రికార్డుని తమ ఖాతాలో వేసుకున్నారు. ఈ టెస్టులో అత్యధిక వైడ్లు విసిరిన ఓ చెత్త రికార్డు నమోదైంది. మూడో టెస్టులో ఇరు జట్ల బౌలర్లు కలిపి మొత్తం 35 వైడ్లు విసిరారు.
నాలుగో స్థానంలో కోహ్లీ: రవిశాస్త్రిది మంచి నిర్ణయం కాదన్న గంగూలీ
దీంతో 11 ఏళ్ల క్రితం వెస్టిండిస్-ఆస్ట్రేలియా బౌలర్లు నమోదు చేసిన వైడ్ల రికార్డు బద్దలైంది. 2008 జూన్లో బ్రిడ్జిటౌన్ వేదికగా జరిగిన మ్యాచ్లో విండిస్-ఆస్ట్రేలియన్ బౌలర్లు కలిపి మొత్తం 34 వైడ్లు విసిరారు. వైడ్ల రూపంలో ఎక్కువ ఎక్స్ట్రా పరుగులిచ్చిన రెండు టెస్టుల్లోనూ వెస్టిండీస్ బౌలర్లు భాగం కావడం విశేషం.
ఇక, ఆ తర్వాతి మూడు టెస్టుల్లో ఎక్కువ వైడ్లు ఇచ్చిన బౌలర్లుగా భారత బౌలర్లు నిలిచారు. గతేడాది జోహెన్స్బర్గ్ వేదికగా దక్షిణాఫ్రికాతో జిరగిన టెస్టులో ఇరు జట్లకు చెందిన బౌలర్లు మొత్తం 33 వైడ్లు విసిరారు. 2013లో అదే వేదికపైగా భారత్, సఫారీ బౌలర్లు 31 వైడ్లు విసిరారు.
ఇక, 1989లో పాక్, భారత్ మధ్య జరిగిన టెస్టులో ఇరు జట్ల బౌలర్లు 30 వైడ్లు వేశారు. ఇదిలా ఉంటే సెయింట్ లూసియా వేదికగా జరిగిన టెస్టులో ఇంగ్లాండ్ జట్టు 232 పరుగుల తేడాతో గెలుపొందింది. దీంతో మూడు టెస్టు మ్యాచ్ల సిరిస్ను ఆతిథ్య వెస్టిండిస్ జట్టు 2-1తో కైవసం చేసుకుంది. తొలి రెండు టెస్టుల్లో విండిస్ జట్టు విజయం సాధించిన సంగతి తెలిసిందే.