
టెస్టు హోదా పోందిన తర్వాత
టెస్టు హోదా పోందిన తర్వాత గతేడాది బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో టీమిండియాతో జరిగిన ఏకైక టెస్టులో ఆప్ఘనిస్థాన్ 109, 108 పరుగులకే ఆలౌటైన సంగతి తెలిసిందే. ఆప్ఘనిస్థాన్కు ఇది నాలుగో టెస్టు కావడం విశేషం. ఐర్లాండ్, బంగ్లాదేశ్ జట్లపై ఆప్ఘన్ టెస్టు విజయాలను నమోదు చేసింది.

నాలుగు టెస్టులాడిన ఆప్ఘన్
మొత్తంగా నాలుగు టెస్టులాడిన ఆప్ఘనిస్థాన్ రెండు టెస్టుల్లో ఓడిపోయి.. మరో రెండు టెస్టుల్లో విజయం సాధించింది. వెస్టిండిస్తో జరిగిన ఏకైక టెస్టులో ఆప్ఘనిస్థాన్ విజయం సాధించినట్లైతే ఆడిన మొదటి నాలుగు టెస్ట్ మ్యాచ్లలో మూడింటిని గెలిచిన మొదటి దేశంగా చరిత్ర సృష్టించేది.

రెండో ఇన్నింగ్స్లో 120 పరుగులకే ఆలౌట్
అంతకుముందు వెస్టిండీస్ తన మొదటి ఇన్నింగ్స్లో 277 పరుగులకు ఆలౌటైంది. అనంతరం బ్యాటింగ్కు దిగిన ఆప్ఘనిస్థాన్ తొలి ఇన్నింగ్స్లో 187 పరుగులు చేసి అలౌటైంది. ఇక, రెండో ఇన్నింగ్స్లో ఆప్ఘనిస్థాన్ 43.1 ఓవర్లలో 120 పరుగులకే ఆలౌటైంది. ఓపెనర్ జావెద్ అహ్మదీ(62) మినహా అంతా నిరాశపరిచారు.

9 వికెట్ల తేడాతో ఘన విజయం
ఫలితంగా విండిస్కు 31 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్ 6.2 ఓవర్లలో వికెట్ కోల్పోయి విజయం సాధించింది. క్రెయిగ్ బ్రాత్వైట్(8) తొలి వికెట్గా పెవిలియన్ చేరగా, క్యాంప్బెల్(19 నాటౌట్), షాయ్ హోప్(6 నాటౌట్)లు మరో వికెట్ పడకుండా విండీస్కు విజయాన్ని అందించారు.


Click it and Unblock the Notifications












