ముంబై: వెస్టిండీస్ క్రికెట్ బోర్డు (డబ్ల్యూఐసీబీ) డేవ్ కామెరూన్ చర్చించుకొని పరిష్కరించుకుందామని బీసీసీఐని కోరుతున్నారు. గత ఏడాది భారత పర్యటన మధ్యలోనే వెస్టిండీస్ క్రికెట్ జట్టు స్వదేశానికి వెళ్లిన విషయం తెలిసిందే. దీనిపై బీసీసీఐ ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఇందుకు నష్టపరిహారం చెల్లించాల్సిందేనని బీసీసీఐ వెస్టిండీస్ క్రికెట్ బోర్డుకు స్పష్టం చేసింది. లేకుంటే న్యాయపరమైన చర్యలు తప్పవని హెచ్చరించింది. జనవరి 20వ తేదీ వరకు డెడ్ లైన్ విధించింది. ఈ నేపథ్యంలో వెస్టిండీసి క్రికెట్ బోర్డు బీసీసీఐని ఇప్పుడు ప్రాధేయపడుతోంది.

సమాచారం మేరకు కామెరూన్ బీసీసీఐకి ఓ మెయిల్ పంపినట్లుగా తెలుస్తోంది. అతను బీసీసీఐ కార్యదర్శి సంజయ్ పటేల్కు మంగళవారం నాడు సందేశం పంపించాడు. తాము ఈ విషయాన్ని చర్చల ద్వారా పరిష్కరించుకోవాలనుకుంటున్నామని కామెరూన్ చెప్పారు.