టీ20 వరల్డ్ కప్-2024లో పాకిస్థాన్ కథ లీగ్ స్టేజ్లోనే ముగిసేలా ఉంది. ఆఖరి మ్యాచ్లో ఐర్లాండ్పై గెలిచి, అంతేగాక అదృష్టంతో సూపర్-8కు చేరాలనుకున్న పాకిస్థాన్ ఆశలు ఆవిరయ్యేలా ఉన్నాయి. గ్రూప్-ఏలో ఉన్న పాకిస్థాన్ ఆడిన మూడు మ్యాచ్ల్లో కేవలం ఒక్క విజయమే సాధించిన విషయం తెలిసిందే. రెండు పాయింట్లు, +0.191 నెట్రన్రేటుతో టేబుల్లో మూడు స్థానంలో ఉంది.
తొలి మ్యాచ్లో అమెరికా చేతిలో పాకిస్థాన్ సూపర్ ఓవర్లో ఓడింది. ఆ తర్వాత ఉత్కంఠ భరితంగగా సాగిన మ్యాచ్లో భారత్తో ఆరు పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఇక మొదటి రెండింట్లో ఓటమిపాలైనప్పటికీ కెనడాపై ఏడు వికెట్ల తేడాతో నెగ్గి పాకిస్థాన్ మెరుగైన రన్రేటుతో సూపర్-8 రేసులో ఉంది. అయితే తదుపరి దశకు చేరుకోవాలంటే ఫ్లోరిడాలోని లాడర్హిల్ స్టేడియంలో ఆదివారం ఐర్లాండ్తో జరగాల్సిన మ్యాచ్లో పాకిస్థాన్ తప్పక గెలవాలి.

అంతేగాక లాడర్హిల్ స్టేడియంలో శుక్రవారం ఐర్లాండ్ చేతిలో అమెరికా ఓడిపోవాల్సి ఉంటుంది. మ్యాచ్ ఫలితాలు ఇలా వస్తే నెట్రన్రేటుతో సంబంధం లేకుండా పాకిస్థాన్ సూపర్-8కు చేరుకుంటుంది. ఎందుకంటే ఇప్పటికే యూఎస్ఏ కంటే పాక్ మెరుగైన నెట్రన్రేటు కలిగి ఉంది. అయితే ఫ్లోరిడాలో మ్యాచ్లు సజావుగా సాగే పరిస్థితులు లేవు. గత కొన్ని రోజులుగా వరుణుడు తీవ్ర ప్రతాపం చూపిస్తున్నాడు. వర్షాల ధాటికి వరదలు పోటెత్తుతున్నాయి.
అమెరికా- ఐర్లాండ్ మ్యాచ్ జరిగే శుక్రవారం కూడా వర్షం పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కేవలం ఈ మ్యాచ్కు మాత్రమే కాదు. లాడర్హిల్లో శనివారం జరిగే ఇండియా వర్సెస్ కెనడా, ఆదివారం జరిగే పాకిస్థాన్ వర్సెస్ ఐర్లాండ్ మ్యాచ్కు వర్షం ముప్పు ఉంది. అయితే అమెరికా-ఐర్లాండ్ లేదా పాకిస్థాన్-ఐర్లాండ్ మ్యాచ్లలో వర్షం కారణంగా ఏ పోరు రద్దయినా పాకిస్థాన్ ఇంటిముఖం పట్టాల్సిందే. ఎందుకంటే మ్యాచ్ రద్దయితే ఇరు జట్లకు చెరో పాయింట్ ఇస్తారు.
అప్పుడు యునైటెడ్ స్టేట్స్ ఖాతాలో అయిదు పాయింట్లు నిలుస్తాయి. ఆ తర్వాత ఐర్లాండ్పై పాక్ నెగ్గినా నాలుగు పాయింట్లతోనే లీగ్ ముగిస్తుంది. దీంతో అమెరికాను పాయింట్ల పరంగా పాక్ దాటలేదు. ఒకవేళ ఐర్లాండ్ చేతిలో అమెరికా ఓటమిపాలై, తమ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయినా పాకిస్థాన్కు నష్టమే. ఆ సందర్భంలో అమెరికా నాలుగు పాయింట్లు, పాకిస్థాన్ మూడు పాయింట్లతోనూ లీగ్ స్టేజ్ను ముగిస్తుంది.