
జట్టు ఓడిన తీరు ఘోరం:
ప్రతి మ్యాచ్ను గెలవాలనే కసితో బరిలో దిగే కోహ్లి లాంటి కెప్టెన్కు ఇలాంటి పరాజయాలు మింగుడుపడని విషయాలు. ముఖ్యంగా సోమవారం రాత్రి హైదరాబాద్లో సన్రైజర్స్పై ఆ జట్టు ఓడిన తీరు ఘోరం. 147 పరుగుల లక్ష్యాన్ని చేధించే క్రమంలో తొలి 7 ఓవర్లలో 60 పరుగులు చేసినా ఆ జట్టు చివరకు విజయానికి 6 పరుగుల దూరంలో నిలిచింది.

అసహనం వ్యక్తం చేసిన విరాట్:
సన్రైజర్స్ చేతిలో ఓటమి అనంతరం జట్టు ప్రదర్శనపై కోహ్లి పెదవి విరిచాడు. ఐపీఎల్ ప్లే ఆఫ్ రేసులో నిలవాలంటే గెలవాల్సిన మ్యాచ్లో ఓడిన తీరు పట్ల విరాట్ అసహనం వ్యక్తం చేశాడు.

ఓటమికి పూర్తిగా అర్హులం
మా జట్టు ఏమాత్రం బాగా ఆడలేదు. ఓటమికి పూర్తిగా అర్హులం. మేం ఆడకూడని షాట్లు ఆడాం. మన్దీప్, గ్రాండ్హోమ్ జట్టును గెలిపించడానికి ప్రయత్నించారు. కానీ బలమైన సన్రైజర్స్ బౌలింగ్ విభాగమే పై చేయి సాధించింది. బౌలింగ్ విభాగంలో హైదరాబాద్కు మరో 10-15 పరుగులు తక్కువగా ఇచ్చి ఉండాల్సింది.

మాకు సన్రైజర్స్కు అదే తేడా:
‘మ్యాచ్ను చేజేతులా పోగొట్టుకున్నాం. ఫీల్డింగ్ బాగా చేశాం. ఈ సీజన్కు ఇక ఇంతే. సన్రైజర్స్ ఆటగాళ్లకు తమ బలమేంటో, పరిమితులేంటో తెలుసు. తమ సామర్థ్యాన్ని దృష్టిలో ఉంచుకొనే వారు ఆడతారు. పరిధి దాటరు. ఒత్తిడిలోనూ తమదైన ఆటతీరు కనబరుస్తారు. మా జట్టుకు సన్రైజర్స్కు అదే తేడా. టీంలో బలమైన ఆటగాళ్లుంటే టోర్నీలో ముందుకెళ్లొచ్చు. ఆల్రౌండ్ టీంగా చెన్నై, పంజాబ్ బాగున్నాయి. సన్రైజర్స్ బౌలింగ్ పటిష్టంగా ఉందని కోహ్లి చెప్పాడు.


Click it and Unblock the Notifications












