బలమైన బౌలింగ్ టీమ్ లేదు:
మ్యాచ్ అనంతరం చెన్నై కెప్టెన్ ధోనీ మాట్లాడుతూ... 'ఆటగాళ్లు అన్ని విభాగాల్లో తప్పులు చేసారు. ఇన్నింగ్స్ బాగానే ఆరంబించాం. 10- 12 ఓవర్ల దాకా ముంబై జట్టును కట్టడి చేశాం. ఆ తర్వాత కొన్ని క్యాచ్లు వదిలేయడం, మిస్ఫీల్డింగ్, బలమైన బౌలింగ్ టీమ్ లేకపోవడం మ్యాచ్ ఫలితాన్ని మార్చేసింది. డెత్ ఓవర్లలో మా బౌలర్లు ముంబై బ్యాట్స్మెన్ను కట్టడి చేయలేకపోయారు' అని ధోని తెలిపారు.
ప్రత్యేక ప్రణాళికలు రంచించాలి:
'జట్టు సభ్యులందరితో ఒకేసారి కాకుండా ఒక్కో ఆటగాడితో సెపరేటుగా మాట్లాడితేనే మెరుగైన ఫలితాలు రాబట్టవచ్చు, అదే చేసి ఎక్కడ తప్పు జరిగిందో తెలుసుకుంటాం. బ్యాట్స్మెన్ ఎక్కడ పరుగులు చేస్తున్నాడో తెలుసుకొని కట్టడి చేస్తాం. మేము మంచి భాగస్వామ్యాలు నిర్మించాల్సి ఉంది, అందుకోసం ప్రత్యేక ప్రణాళికలు రంచించాలి' అని ధోనీ చెప్పుకొచ్చారు.
గాయాలు వేధిస్తున్నాయి:
'బ్రావోను గాయం వేధిస్తోంది. మరికొంత మంది ఆటగాళ్లు కూడా గాయాల కారణంగా మ్యాచ్కు దూరమయ్యారు. స్టార్ పేసర్ డేవిడ్ విల్లీ వ్యక్తిగత కారణాల వలన జట్టుకు దూరమయ్యాడు. లుంగీ ఎంగిడి కూడా జట్టుతో కలవలేదు. రానున్న మ్యాచ్లలో సరైన కాంబినేషన్లు సెట్ చేసి విజయాలు సాధిస్తాం' అని ధోనీ ఆశాభావం వ్యక్తం చేసారు.