హైదరాబాద్: ఇంగ్లీషు గడ్డపై 1-4తో టెస్టు సిరిస్ను చేజార్చుకోవడంపై భారత జట్టుపై తీవ్ర విమర్శలు చెలరేగిన సంగతి తెలిసిందే. దీంతో టీమిండియాపై వస్తోన్న విమర్శలపై హెడ్ కోచ్ రవిశాస్త్రి స్పందించాడు. తాము జట్టుకు ఏంచేశామో తమకు తెలుసని, ఈ విమర్శలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పాడు.
ఆసియా కప్: ధోనితో షోయబ్ మాలిక్ కరచాలనం (వీడియో వైరల్)
"ఇంగ్లీషు గడ్డపై భారత జట్టు దారుణంగా విఫలమవ్వలేదు. విజయానికే ప్రయత్నించాం. అయితే, ఇంగ్లాండ్ గెలుపు క్రెడిట్ మాత్రం శామ్ కర్రన్దే. అతను మ్యాన్ ఆఫ్ ది సిరీస్కు అర్హుడని కోహ్లీ, నేను అనుకున్నాం. ఇంగ్లాండ్ కన్నా శామ్ కర్రనే మమ్మల్ని దెబ్బతీశాడు. ఎడ్జ్బాస్టన్లో క్లిష్ట పరిస్థితిలో ఉన్న ఇంగ్లాండ్ను బ్యాట్తో రాణించి గట్టెక్కించాడు" అని శాస్త్రి తెలిపాడు.
ఆసియా కప్ 2018: ఏ జట్టూ నమోదు చేసిన రికార్డులు భారత్ సొంతం
"సౌతాంప్టన్ వేదికగా జరిగిన నాలుగో టెస్ట్లో సైతం ఆల్రౌండ్ ప్రదర్శనతో మా విజయాన్ని లాగేశాడు. కీలక సమయాల్లో అటు బ్యాట్తో ఇటు బంతితో మెరిసాడు. ఇదే ఇరు జట్లలో ఉన్న వ్యత్యాసం. భారత జట్టు ఇప్పటికీ వరల్డ్ నంబర్ వన్. మేము ఎలా పోరాడామో ఇంగ్లండ్కు తెలుసు. మీడియాకు తెలుసు. మన అభిమానులకు తెలుసు. మా అంతరాత్మకు కూడా తెలుసు" అని రవిశాస్త్రి పేర్కొన్నాడు.