నాలుగో టెస్టులో గెలిచే అవకాశం
సౌతాంప్టన్ వేదికగా జరిగిన నాలుగో టెస్టులో గెలిచే అవకాశం వచ్చినప్పటికీ దానిని జారవిడుచుకోవడంతో అటు మ్యాచ్తో పాటు ఇటు సిరీస్ 1-3తో చేజార్చుకుంది. ఈ ఓటమిపై జట్టులోని ఆటగాళ్లు కూడా అభిమానుల్లాగే ఓటమి పట్ల తీవ్ర బాధతో ఉన్నారని ఓపెనర్ శిఖర్ ధావన్ వెల్లడించాడు.
ఓవల్ వేదికగా శుక్రవారం నుంచి ఐదో టెస్టు
ఐదు టెస్టు మ్యాచ్ల సిరిస్లో భాగంగా చివరిదైన ఐదో టెస్టు శుక్రవారం నుంచి ఓవల్ వేదికగా ప్రారంభం కానుంది. ఈ నేఫథ్యంలో శిఖర్ ధావన్ మాట్లాడుతూ "ఓటమి పట్ల ప్రతికూలంగా రాస్తున్నారు కానీ అభిమానుల్లాగే మేం కూడా చాలా బాధపడ్డాం. తప్పులు నుంచి నేర్చుకొని ముందుకెళ్లడం ముఖ్యం" అని అన్నాడు.
శక్తిమేర ఆడి విజయాల కోసం పోరాడతాం
"మైదానంలో అడుగుపెట్టిన ప్రతిసారి అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వాలనే అనుకుంటాం. గతాన్ని మనం మార్చలేం. ఎప్పటిలాగే మా శక్తిమేర ఆడి విజయాల కోసం పోరాడతాం. ప్రాక్టీస్ తర్వాత సరాదాగా ఉండి తీరాలి. అందుకే జట్టులో సానుకూల పరిస్థితిని మెరుగుపర్చుకుంటున్నాం. ఛాంపియన్లు ఇలాగే చేస్తారు" అని ధావన్ తెలిపాడు.
సానుకూలంగా ఉండేవాళ్లే యోధులు
"గెలిచినపుడు బాగానే ఉంటుంది. కానీ ఓడినపుడు కూడా సానుకూలంగా ఉండేవాళ్లే యోధులు. మ్యాచ్కు ముందు రోజు మానసిక స్థైర్యం కలిగి ఉండడం ప్రధానం. ఇప్పటికీ మాకు మద్దుతుగా నిలుస్తున్న అభిమానులకు ధన్యవాదాలు" అని శిఖర్ ధావన్ ఇనిస్టాగ్రామ్లో పోస్టు పెట్టాడు.