హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) పదో సీజన్లో భాగంగా మంగళవారం ముంబైతో జరిగిన క్వాలిఫెయర్-1 మ్యాచ్లో రైజింగ్ పుణె సూపర్జెయింట్ ఘనవిజయం సాధించి ఫైనల్కు దూసుకెళ్లింది.
ఐపీఎల్ ప్రత్యేక వార్తలు | ఐపీఎల్ పాయింట్ల పట్టిక | ఐపీఎల్ 2017 ఫోటోలు
ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన పూణె నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 162 పరుగులు చేసింది. అనంతరం పూణె నిర్దేశించిన 163 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ ఛేజింగ్ చేస్తుండగా ఓ ఆసక్తికర సంఘటన జరిగింది.

మ్యాచ్లో భాగంగా కెప్టెన్ స్మిత్ తాను తొలుత తీసుకున్న నిర్ణయాన్ని ధోని సూచన మేరకు వెంటనే మార్చుకున్నాడు. 8వ ఓవర్ ముగిసే వాషింగ్టన్ సుందర్ 3 ఓవర్లు వేసి రోహిత్ శర్మ(1), అంబటి రాయుడు(0), కీరన్ పొలార్డ్(7) వికెట్లు తీశాడు.
దీంతో పదో ఓవర్ను కూడా సుందర్చే వేయించాలని స్మిత్ నిర్ణయించుకున్నాడు. ఈ లోపు ధోని కలగజేసుకుని సుందర్ను బౌలింగ్కు వద్దని, ఆడమ్ జంపాకు బౌలింగ్ ఇవ్వమని సూచించాడు. ధోని ఇచ్చిన సలహాను స్మిత్ వెంటనే పాటించాడు.
ఆ తర్వాత వాషింగ్టన్ సుందర్ చేత స్మిత్ 13వ ఓవర్ వేయించాడు. ఈ ఓవర్లో స్మిత్ నాలుగు పరుగులు మాత్రమే ఇచ్చి ముంబై ఆల్రౌండర్ క్రునాల్ పాండ్యాను అవుట్ చేసే అవకాశాన్ని తృటిలో మిస్సయ్యాడు.
ఈ మ్యాచ్లో నాలుగు ఓవర్లకు 16 పరుగులు మాత్రమే ఇచ్చి 3 కీలక వికెట్లు తీసి పూణ విజయంలో కీలకపాత్ర పోషించిన వాషింగ్టన్ సుందర్కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.