హైదరాబాద్: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని కోచ్ అవతారమెత్తాడు. ముంబైలోని వాంఖడే వేదికగా భారత్-శ్రీలంక జట్ల మధ్య ఆదివారం చివరి టీ20 జరిగింది. ఈ మ్యాచ్లో టీమిండియా ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. దీంతో మూడు టీ20ల సిరిస్ను 3-0తో క్లీన్స్వీప్ చేసింది.
భారత పర్యటనకు వచ్చిన శ్రీలంక జటు మూడ ఫార్మాట్లలో కూడా పేలవ ఫామ్ను ప్రదర్శించింది. దీంతో మూడో టీ20 అనంతరం అవార్డుల కార్యక్రమం జరుగుతున్న సమయంలో ఆ జట్టు కెప్టెన్ తిషారా పెరీరాను కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ ఇంటర్వ్యూ చేస్తున్న సమయంలో శ్రీలంక ఆటగాళ్లు కొందరు ధోని వద్దకు వచ్చారు.
ఈ సమయంలో వారు ధోని నుంచి సలహాలు తీసుకున్నారు. అకిల ధనంజయ, ఉపుల్ తరంగ, సడేరా సమరవిక్రమలతో ధోని కొన్ని షాట్లను ఎలా బాదాలో వివరించాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాల వైరల్ అయింది. ఈ వీడియో మీకోసం ప్రత్యేకంగా....