హైదరాబాద్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మైదానంలో ఎంతో దూకుడుగా ఉంటాడు. ప్రత్యర్ధి జట్టు వికెట్ పడిన ప్రతిసారీ జట్టులోని ఆటగాళ్లు సంగతి ఏమో గానీ, కోహ్లీ మాత్రం తనదైన శైలిలో సంబరాలు చేసుకుంటాడు. రెండు టెస్టు మ్యాచ్ల సిరిస్లో భాగంగా వెస్టిండిస్తో శుక్రవారం హైదరాబాద్ వేదికగా ప్రారంభమైన టెస్టులో కూడా కోహ్లీ ఇలానే సంబరాలు చేసుకున్నాడు.
హైదరాబాద్ టెస్ట్, డే1: ఛేజ్ 98 నాటౌట్, వెస్టిండిస్ 295/7
అయితే, ఈసారి కోహ్లీ సంబరాలు చేసుకుంది ప్రత్యర్ధి జట్టు ఆటగాడి వికెట్ తీసినప్పుడు కాదు... కెప్టెన్గా తాను అడిగిన డీఆర్ఎస్ సక్సెక్ కావడంతో చిన్నపిల్లాడిలా మైదానంలో ఎగిరి గంతులేశాడు. వివరాల్లోకి వెళితే... ఇన్నింగ్స్ 60వ ఓవర్ వేసిన ఉమేశ్ బౌలింగ్లో డార్విచ్ (30) బంతిని డిఫెన్స్ ఆడేందుకు ప్రయత్నించాడు.
ఈ క్రమంలో బంతి అతని బ్యాట్కి అందకుండా నేరుగా వెళ్లి ఫ్యాడ్స్ని తాకింది. దీంతో భారత్ ఎల్బీ కోసం అప్పీల్ చేయగా.. బంతి వికెట్లపైకి వెళ్లేలాలేదని భావించిన ఫీల్డ్ అంపైర్ అప్పీల్ని తిరస్కరించాడు. అయితే.. బంతి కచ్చితంగా వికెట్లను తాకుతుందని ఊహించిన కోహ్లీ డీఆర్ఎస్ అడగ్గా రిప్లైలో బంతి స్టంప్స్ను తాకేలా కనిపించింది.
ఖాజా రికార్డు: బాబర్ ఆజాం స్టన్నింగ్ క్యాచ్కు నెటిజన్ల ఫిదా (వీడియో)
దీంతో ఫీల్డ్ అంపైర్ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని బ్యాట్స్మన్ను ఔట్గా ప్రకటించాడు. థర్డ్ అంపైర్ నిర్ణయాన్ని రిప్లేలో చూస్తోన్న సమయంలోనే డార్విచ్ ఔటని తేలడంతో కోహ్లీ ఎగిరి గంతులేశాడు. ఇందుకు సంబంధించిన వీడియోని బీసీసీఐ తన అధికారిక ట్విట్టర్లో అభిమానులతో పంచుకుంది.
Celebrating a wicket like 😀👍✌️#INDvWI pic.twitter.com/H6aFpeyj6J
— BCCI (@BCCI) October 12, 2018