తొలి సెమీఫైనల్లో 18 పరుగుల తేడాతో ఓటమి
మాంచెస్టర్ వేదికగా న్యూజిలాండ్తో జరిగిన తొలి సెమీఫైనల్లో 18 పరుగుల తేడాతో ఓటమిపాలై టీమిండియా ప్రపంచకప్ నుంచి నిష్క్రమించింది. అయితే, బీసీసీఐ వెంటనే టికెట్లు ఏర్పాటు చేయకపోవడంతో భారత జట్టులోని ఆటగాళ్లు కొన్ని రోజులు ఇంగ్లాండ్లోనే ఉండాల్సిన పరిస్థితి తలెత్తింది.
స్వదేశానికి చేరుకున్న కోహ్లీ
దీంతో గురువారం విరుష్క దంపతులు సైతం స్వదేశానికి చేరుకున్నారు. మరోవైపు విరాట్ కోహ్లీ కోసం సెలక్షన్ కమిటీ సమావేశం వాయిదా పడినట్టు తెలుస్తోంది. వెస్టిండిస్ పర్యటన కోసం శుక్రవారం టీమిండియాను ఎంపిక చేయాల్సి ఉంది. అయితే, ఈ సమావేశం చివరి నిమిషంలో వాయిదా పడింది.
|
సెలక్షన్ కమిటీ సమావేశం వాయిదా
శుక్రవారం జరగనున్న సెలక్షన్ కమిటీ సమావేశానికి కోహ్లీ హాజరయ్యే పరిస్థితి లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. శనివారం లేదంటే ఆదివారం తిరిగి సెలక్షన్ కమిటీ సమావేశమై విండీస్ టూర్కు జట్టును ఎంపిక చేయనున్నట్టు తెలుస్తోంది. వెస్టిండిస్ పర్యటనలో భాగంగా టీమిండియా మూడు వన్డేలు, మూడు టీ20లు, రెండు టెస్టు మ్యాచ్లు విండీస్తో తలపడనుంది.