చెలరేగిన పంత్
జైపూర్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో రిషభ్ పంత్ 36 బంతుల్లో 78 నాటౌట్ (6 ఫోర్లు, 4 సిక్స్లు) మెరుపు ఇన్నింగ్స్తో ఢిల్లీ క్యాపిటల్స్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ విజయం సాధించడంతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి ఎగబాకింది. ఈ నేపథ్యంలో జట్టు యాజమాన్యంతో పాటు ఢిల్లీ అభిమానులు సైతం పంత్పై ప్రశంసల వర్షం కురిపించారు.
|
పృథ్వీ షాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో
కాగా మ్యాచ్ అనంతరం జట్టులోని సహచర ఆటగాడు పృథ్వీ షాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పంత్ మాట్లాడుతూ క్లిష్ట పరిస్థితిల్లో జట్టును గెలిపించినపుడు కలిగే ఆనందాన్ని దేనితోనూ కొలవలేమని అన్నాడు. అలాగే, సౌరవ్ సార్ చూపిన ప్రేమకు తాను ఫిదా అయ్యానంటూ పంత్ చెప్పుకొచ్చాడు. "సౌరవ్ సార్ నన్ను ఎత్తుకోవడం మాత్రం మరిచిపోలేను. అది నాకు చాలా ప్రత్యేకమైన క్షణం. అదొక వింతైన అనుభవం" అని పంత్ అన్నాడు.
|
చాలా సంతోషంగా ఉంది
"నిజంగా ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా మిడిల్ ఓవర్లలో నీతో కలిసి ఆడుతున్నపుడు. మనం మ్యాచ్ ఫినిష్ చేస్తామని తెలుసు" అని పంత్ అన్నాడు. ఇక, జోఫ్రా ఆర్చర్ బౌలింగ్లో లైఫ్ గురించి పంత్ ప్రశ్నించగా పృథ్వీషా "ఇలాంటి అనుభవం నాకు ఇదే తొలిసారి. నేను నమ్మలేకపోయాను. బంతి నా బ్యాట్ను తాకిందని అనుకున్నా. బెయిల్స్ వెలిగాయని నువ్వే అనుకుంటా నాతో చెప్పింది" అని అన్నాడు.
బెయిల్స్ కిందపడలేదు
కాగా, ఈ మ్యాచ్లో రాజస్థాన్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ ఫుల్ టాస్ వేయగా అది స్టంప్స్ను తాకింది గానీ బెయిల్స్ కిందపడలేదు. దీంతో పృథ్వీ షా బ్రతికిపోయాడు. ఈ మ్యాచ్లో పృథ్వీషా 39 బంతుల్లో 42(4 ఫోర్లు, ఒక సిక్స్) పరుగులు చేసి ధావన్తో కలిసి చక్కటి ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు.