146 పరుగులు చేసిన న్యూజిలాండ్
దీంతో నిర్ణీత ఓవర్లలో న్యూజిలాండ్ 146 పరుగులు చేసింది. అయితే, న్యూజిలాండ్ ఇన్నింగ్స్లో రాస్ టేలర్ రనౌట్ మ్యాచ్కే హైలెట్గా నిలిచింది. ఇన్నింగ్స్ చివరి బంతికి రాస్టేలర్(3)ను ఇంగ్లాండ్ వికెట్ కీపర్ శామ్ బిల్లింగ్స్
రనౌట్ చేశాడు. అచ్చం ధోనీలాగా వికెట్లను చూడకుండా గిరాటేశాడు.
వీడియో వైరల్
ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అనంతరం 147 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 146 పరుగులు చేయడంతో మ్యాచ్ ‘టై' అయింది. ఇంగ్లాండ్ జట్టులో ఓపెనర్ జానీ బెయిర్స్టో(47) అద్భుత ప్రదర్శన చేశాడు.
సూపర్ ఓవర్ ఆడిన ఇరు జట్లు
దీంతో మ్యాచ్ విజేతను నిర్ణయించేందుకు సూపర్ ఓవర్ ఆడించారు. సూపర్ ఓవర్లో బెయిర్స్టో, మోర్గాన్ 17 పరుగులు చేయగా.. న్యూజిలాండ్ కేవలం 8 పరుగులకే పరిమితమైంది. ఈ మ్యాచ్లో విజయం సాధించడంతో ఐదు టీ20ల సిరిస్ను ఇంగ్లాండ్ 3-2తో కైవసం చేసుకుంది.
3-2తో సిరిస్ ఇంగ్లాండ్ కైవసం
అంతకముందు జరిగిన నాలుగు టీ20ల్లో ఇరు జట్లు చెరో రెండు మ్యాచ్లు గెలిచాయి. ఇదిలా ఉంటే, ఇటీవలే ఇంగ్లాండ్ వేదికగా ముగిసిన వన్డే వరల్డ్కప్ పైనల్లో కూడా రెండు జట్లు సూపర్ ఓవర్ ఆడాయి. సూపర్ ఓవర్లో కూడా పరుగులు సమం కావడంతో బౌండరీ రూల్ ఆధారంగా ఇంగ్లాండ్ను ఐసీసీ విజేతగా ప్రకటించింది.


Click it and Unblock the Notifications












