హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) పదో సీజన్లో రవీంద్ర జడేజా తన అద్భుత ఫీల్డింగ్తో ప్రత్యర్ధి బ్యాట్స్మెన్లను హడలెత్తిస్తున్నాడు. మైదానంలో అతడు ఏమూలనున్నా సునాయాసంగా బంతిని వికెట్ల మీదికి నేరుగా విసిరి బ్యాట్స్మన్ను రనౌట్ చేస్తున్నాడు.
ఐపీఎల్ పదో సీజన్లో ఎక్కువ మంది ఆటగాళ్లను రనౌట్గా పెవిలియన్ పంపిన ఆటగాడు కూడా రవీంద్ర జడేజానే కావడం విశేషం. గుజరాత్ లయన్స్ జట్టు చేసిన 12 రనౌట్లలో 5 రవీంద్ర జడేజా చేసినవే కావడం విశేషం.
కాన్పూర్ వేదికగా బుధవారం ఢిల్లీ డేర్ డెవిల్స్తో జరిగిన మ్యాచ్లో జడేజా 11 బంతుల వ్యవధిలో రెండు రనౌట్లు చేశాడు. ఐపీఎల్ పదో సీజన్లో ఇప్పటివరకు జడేజా చేసిన రనౌట్ల వీడియోలు....