For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

మావోడి మీద పుకార్లు పుట్టించింది ఎవ్రడా భయ్..చెప్పుండ్రి: జర్నలిస్టులను నిలదీసిన రోహిత్

 Watch: Rohit Sharma asking journalists on who started the rumors on Chahal and Dhanashree

అబుధాబి: యుజ్వేంద్ర చాహల్-ధనశ్రీ వర్మ. కొద్దిరోజులుగా తరచూ వార్తల్లో నిలుస్తోన్న జంట. టీమిండియా స్టార్ స్పిన్ బౌలర్ చాహల్ తన భార్య ధన్మశ్రీ వర్మతో విడాకులు తీసుకోబోతోన్నాడనే వార్త ఇటీవల సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. విస్తృతంగా చక్కర్లు కొట్టింది. ఆసియా కప్ లేదా టీ20 ప్రపంచ కప్ టోర్నమెంట్ తరువాత యుజ్వేంద్ర చాహల్ విడాకులకు దరఖాస్తు చేసుకుంటాడంటూ కథనాలు వెలువడ్డాయి.

ఫేక్ అకౌంట్స్‌తో..

ఫేక్ అకౌంట్స్‌తో..

ధనశ్రీ వర్మ తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో పోస్ట్ చేసిన ఒకట్రెండు అంశాలు.. ఈ తరహా పుకార్లకు కారణం అయ్యాయి. తొలుత ఆమె తన పేరు నుంచి చాహల్ అనే పదాలను తొలగించింది. ఆ తరువాత న్యూ లైఫ్ లోడింగ్.. అనే ఓ ఫొటోను పోస్ట్ చేసింది. దీనితో వారిద్దరూ విడిపోబోతున్నారంటూ వదంతులు వ్యాపించాయి. అదే సమయంలో ప్రముఖ న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐ ఫేక్ అకౌంట్‌ను సృష్టించిన కొందరు యూజర్లు అందులో కూడా ఈ విషయాన్ని పోస్ట్ చేశారు. దీనితో అది నిజం అని నమ్మారు.

పర్సనల్ లైఫ్ డిస్టర్బ్..

పర్సనల్ లైఫ్ డిస్టర్బ్..

అవి ఫేక్ అంటూ నెత్తీనోరు బాదుకున్నప్పటికీ.. ఎవరూ వినిపించుకోలేదు. సోషల్ మీడియాలో వెల్లువెత్తిన ఈ సమాచారం ఫేక్ అంటూ నిరూపించుకోవడానికి వారిద్దరూ ప్రత్యేకంగా కొన్ని వీడియోలను సైతం పోస్ట్ చేయాల్సి వచ్చింది. హేట్ ఫుల్, హర్ట్‌ ఫుల్ అంటూ చాహల్-ధనశ్రీ వర్మ కామెంట్స్ పెట్టారు. అలాంటి వార్తల వల్ల తమ వ్యక్తిగత జీవితం డిస్టర్బ్ అయిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అయినప్పటికీ- వాటికి బ్రేక్ పడలేదు.

రోహిత్ రియాక్ట్

దీనిపై తాజాగా భారత క్రికెట్ జట్టు కేప్టెన్ రోహిత్ శర్మ రియాక్ట్ అయ్యాడు. యుజ్వేంద్ర చాహల్-ధనశ్రీ వర్మ విడిపోతున్నారంటూ వదంతులు పుట్టించిన వారెవరంటూ ఆరా తీశాడు. ఈ విషయాన్ని అతను నేరుగా జర్నలిస్టులనే నిలదీశాడు. బతావో. కౌన్ హై అంటూ ప్రశ్నించాడు. ఆ సమయంలో యుజ్వేంద్ర చాహల్ అతని పక్కనే ఉన్నాడు. దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో టీమిండియా ప్రాక్టీస్ సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది.

పుకార్లు పుట్టించిందెవరు..?

పుకార్లు పుట్టించిందెవరు..?

గ్రౌండ్‌లో రోహిత్ శర్మ, చాహల్, ఫిజియోథెరపిస్ట్ ఉండటాన్ని చూసిన కొందరు భారత విలేకరులు వారిని చుట్టుముట్టారు. భారత్-పాకిస్తాన్ మ్యాచ్ కోసం ఎలా సన్నద్ధమౌతున్నారంటూ ప్రశ్నించాడు. దీనికి రోహిత్ శర్మ బదులివ్వలేదు గానీ.. ఎదురు ప్రశ్నలు గుప్పించాడు. యుజ్వేంద్ర చాహల్-ధనశ్రీ వర్మ వ్యక్తిగత జీవితంపై పుకార్లు పుట్టించి ఎవరంటూ నిలదీశాడు. వేలు ఎత్తి మరీ ప్రశ్నించాడు. అనూహ్యమైన ఈ ఘటనతో విలేకరులు బిత్తరపోయారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఒకరిపై ఒకరు

ఒకరిపై ఒకరు

ఆ వదంతులు పుట్టించిన జర్నలిస్ట్ ఇక్కడే ఉన్నాడంటూ తోటి వారు సమాధానం ఇవ్వడం ఈ వీడియోలో రికార్డయింది. ఇతనే పోస్ట్ చేశాడంటూ ఓ జర్నలిస్ట్ గురించి చెప్పడం వినిపించింది. దీనికి అతను- తానేమీ చేయలేదని, అలాంటి పోస్టులేవీ షేర్ చేయలేదంటూ సమాధానం ఇచ్చాడు. కొద్దిసేపటి తరువాత జర్నలిస్టులతో ఆసియా కప్ టోర్నమెంట్‌‌కు సంబంధించిన విషయాలేవీ మాట్లాడకుండా ముగ్గురూ వెళ్లిపోయారు.

Story first published: Saturday, August 27, 2022, 16:43 [IST]
Other articles published on Aug 27, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+