|
థమ్సప్ సింబల్ చూపించిన కోహ్లీ
అభిమానుల నినాదాలకు విరాట్ కోహ్లీ థమ్సప్ సింబల్ చూపించాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా, ఐదు వన్డేల సిరీస్లో ఇప్పటికే నాలుగు వన్డేలు ముగియగా.. టీమిండియా 2-1తో ఆధిక్యంలో కొనసాగుతోంది.
తిరువనంతపురం వేదికగా ఐదో వన్డే
ఐదు వన్డేల సిరీస్లో తొలి వన్డేలో భారత్ విజయం సాధించగా, విశాఖలో జరిగిన రెండో వన్డే టైగా ముగిసింది. పుణెలో జరిగిన మూడో వన్డేలో విండీస్ విజయం సాధించగా, తాజా వన్డేను భారత్ కైవసం చేసుకుంది. ఇరు జట్ల మధ్య ఐదో వన్డే తిరువనంతపురం వేదికగా నవంబరు 1న జరగనుంది.
|
ఇరు జట్లకు అభిమానులు పెద్దఎత్తున స్వాగతం
విమానాశ్రయంలో ఇరు జట్ల ఆటగాళ్లకు అభిమానులు పెద్దఎత్తున స్వాగతం పలికారు. ఆ తర్వాత హోటల్కు చేరుకున్న ఆటగాళ్లకు కేరళ సంప్రదాయక వాయిద్యాలతో కొంతమంది కళాకారులు చేసిన ప్రదర్శన అందులో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దీనికి సంబంధించిన ఫొటోలను బీసీసీఐ తన ట్విట్టర్లో పోస్టు చేసింది.
|
అభిమానులకు ప్రత్యేక ధనవాద్యాలు తెలిపిన బీసీసీఐ
ఇంతటి ఘనస్వాగతం పలికిన అభిమానులకు ప్రత్యేక ధనవాద్యాలంటూ బీసీసీఐ ట్వీట్ చేసింది. మరోవైపు వెస్టిండీస్ క్రికెట్ జట్టు కూడా తమ అధికారిక ట్విటర్ ఖాతాలో ఓ వీడియోను పంచుకుంది. కేరళను చూస్తుంటే మా దేశం గుర్తుకు వస్తుందంటూ వీడియో కింద రాసుకొచ్చింది.