టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్
ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్ జట్టు 37.5 ఓవర్లు ముగిసే సమయానికి 157/9తో నిలిచింది. ఈ దశలో ఆఖరి వికెట్ కోసం కుల్దీప్ యాదవ్తో కలిసి ధోని వ్యూహం రచించి సక్సెస్ అయ్యాడు. ధోని వ్యూహం కారణంగానే ఈ మ్యాచ్లో న్యూజిలాండ్ 38 ఓవర్లలోపే ఆలౌటైంది.
కుల్దీప్కు హిందీలో సూచనలు
క్రీజులో ఉన్న న్యూజిలాండ్ బ్యాట్స్మన్ ట్రెంట్ బౌల్ట్ (1: 10 బంతుల్లో) బంతిని డిఫెన్స్ చేసేందుకు ప్రయత్నిస్తుండటాన్ని ధోని పసిగట్టాడు. దీంతో కుల్దీప్ యాదవ్కి వికెట్ల వెనుక నుంచి హిందీలో సూచనలు చేశాడు. బంతిని వికెట్లకి వెలుపలగా విసరాలని సూచిస్తూనే.. ఏమాత్రం లోపలికి వేయద్దని హెచ్చరించాడు.
స్లిప్లో రోహిత్ శర్మ
అదే సమయంలో స్లిప్లో రోహిత్ శర్మని మొహరించాడు. ధోని చెప్పిన విధంగానే కుల్దీప్ యాదవ్ బంతిని వేయగా... ఆ బంతిని ప్లిక్ చేసేందుకు బౌల్ట్ ప్రయత్నించగా గాల్లోకి లేచిన బంతిని రోహిత్ శర్మ అమాంతం క్యాచ్గా అందుకున్నాడు. దీంతో న్యూజిలాండ్ 157 పరుగులకే ఆలౌటైంది.
|
సోషల్ మీడియాలో వైరల్
ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. గతేడాది సెప్టెంబరులో జరిగిన ఆసియా కప్లో ధోని సూచనల్ని పెడచెవిన పెట్టిన కుల్దీప్ యాదవ్ని ‘బౌలింగ్ మారుస్తావా? లేక బౌలర్ని మార్చమంటావా?' అంటూ ధోని హెచ్చరించిన సంగతి తెలిసిందే.