ధోని పక్క నుంచి వికెట్లకి దూరంగా
అయితే, అతడి శరీరాన్ని తాకిన బంతి ధోని పక్క నుంచి వికెట్లకి దూరంగా వెళ్లింది. బంతి ఎక్కడికి వెళ్లిందోనని తెలుసుకునేందుకు కొన్ని క్షణాల సమయం తీసుకున్నాడు. అదే సమయంలో వికెట్ల వెనుకన ఉన్న బంతిని చూసి పరుగు కోసం సాహసోపేతంగా క్రీజు వెలుపలికి వెళ్లాడు. అయితే.. అప్పటికే బంతిని అందుకున్న ధోని రెప్పపాటులో దానిని వికెట్లపైకి విసిరాడు.
— Mr Gentleman (@183_264) February 3, 2019 |
ధోని త్రోని ఊహించలేకపోయిన నీషమ్
ధోని త్రోని ఊహించలేకపోయిన నీషమ్ పేలవంగా రనౌటై నిరాశగా పెవిలియన్కు చేరాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇదిలా ఉంటే, న్యూజిలాండ్తో జరిగిన ఐదో వన్డేలో భారత్ విజయం సాధించింది. దీంతో వన్డే సిరీస్ను టీమిండియా ఘనంగా ముగించింది. సమష్టిగా రాణించిన భారత్ జట్టు 35 పరుగుల తేడాతో అలవోక విజయాన్ని అందుకుంది.
ఐదు వన్డేల సిరీస్ని 4-1తో టీమిండియా కైవసం
దీంతో ఐదు వన్డేల సిరీస్ని 4-1తో టీమిండియా కైవసం చేసుకుంది. 253 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ జట్టు 44.1 ఓవర్లలోనే 217 పరుగులకి కుప్పకూలిపోయింది. న్యూజిలాండ్ బ్యాట్స్మెన్లలో జేమ్స్ నీషమ్ (44), విలియమ్సన్ (39) ఫర్వాలేదనిపించారు.
బుధవారం నుంచి కివీస్తో మూడు టీ20ల సిరీస్
భారత బౌలర్లలో చాహల్ (3/41), మహ్మద్ షమీ (2/35), హార్దిక్ పాండ్య (2/50) అద్భుత ప్రదర్శన చేశారు. అంతకముందు టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 49.5 ఓవర్లకు 252 పరుగులు చేసింది. భారత క్రికెట్ జట్టు... బుధవారం నుంచి కివీస్తో మూడు టీ20ల సిరీస్లో తలపడనుంది.