హైదరాబాద్: మహేంద్ర సింగ్ ధోని క్రికెట్ అభిమానులకు పరిచయం అక్కర్లేని పేరు. ధోనికి ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది అభిమానులు ఉన్నారు. అభిమానులు ధోని వద్దకు వచ్చినప్పుడు వారిని నిరాశపరచకుండా వారితో సెల్ఫీలు దిగుతూ ఉంటాడు. అదే ధోని ప్రత్యేకత. గురువారం అలాంటి సంఘటనే చోటు చేసుకుంది.
2019 వరల్డ్కప్లో ధోనియే No.1 ప్లేయర్: మాజీ కెప్టెన్
ప్రస్తుతం ధోని ఆస్ట్రేలియా పర్యటనలో ఉనన సంగతి తెలిసిందే. ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్ కోసం ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో 87 ఏళ్ల బామ్మ ధోని చూసేందుకు వచ్చింది. నెట్ ప్రాక్టీస్ అయిన తర్వాత ధోని కాసేపు ఆమెతో ఆప్యాయంగా మాట్లాడుతూ కొంత సమయం గడిపాడు. అనంతరం ఆమెతో కలిసి ఫోటోలు దిగాడు.
ఆమెతో కలిసి దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ప్రస్తుతం ధోని శనివారం నుంచి ఆస్ట్రేలియాతో జరగనున్న మూడు వన్డేల సిరిస్కు సిద్ధమవుతున్నాడు. ఈ సిరిస్ ముగిసిన తర్వాత న్యూజిలాండ్ సిరిస్, ఆ తర్వాత ఫిబ్రవరిలో ఆస్ట్రేలియా జట్టు భారత పర్యటనకు రానుంది.
ఈ సిరిస్లలో రాణించి ధోని తిరిగి ఫామ్ను అందుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు. వన్డే వరల్డ్కప్ ఆరంభానికి ముందు భారత్ 13 వన్డేలు మాత్రమే ఆడనుండటంతో అందరి దృష్టి ధోనిపైనే ఉంది.
Craze Level: MAHENDRA SINGH DHONI ! 🦁❤😎#MSDhoni #Dhoni #Fans #Craze #Demigod #Legend #AUSvIND #India #Australia @msdhoni @seemantlohani @mihir_diwakar pic.twitter.com/SxrYQPxLDR
— Aabhas Raj (@msdhoniaddicted) January 9, 2019