ఛారిటీ పుట్బాల్ మ్యాచ్: ధోనిని చూసేందుకు ఎగబడ్డ అభిమానులు (వీడియో)

హైదరాబాద్: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఈ పేరు తెలియని క్రీడాభిమాని ఉండడేమో అంటే అతిశయోక్తి కాదు. తనదైన అద్భుతమైన ఆటతీరుతో క్రికెట్లో ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు. అంతే కాకుండా వికెట్ కీపర్గా క్రికెట్ చరిత్రలో తనదైనా ముద్ర వేశాడు. వికెట్ల వెనుక కూడా ప్రత్యర్ధి జట్టు బ్యాటమెన్స్ను ముప్పు తిప్పలు పెట్టగలడు.
చారిటీ ఫుట్బాల్ మ్యాచ్లో ధోని
అయితే ముంభైలో జరిగిన ఒక చారిటీ ఫుట్బాల్ మ్యాచ్లో తళుక్కున మెరిశాడు. దీనితో మహీ అక్కడున్నాడని తెలుసుకున్న అతని అభిమానులు ఫుట్ బాల్ మ్యాచ్ జరిగే ప్లేస్ కు వచ్చేసి ఆనందంతో కేరింతలు కొట్టారు. అయితే ఆస్ట్రేలియా సిరీస్ ద్వారా ధోని ఎక్కువ మ్యాచ్లు ఆడిన కీపర్గా రికార్డుల్లోకి ఎక్కనున్నాడు.

ఆసీస్తో వన్డే సిరిస్లో ధోని ఖాతాలో రికార్డు
ప్రస్తుతం మార్క్ బౌచర్ 596 మ్యాచ్లతో ధోని కంటే ముందు స్థానం లో ఉన్నాడు. ధోని ప్రస్తుతం 594 మ్యాచ్ లు వికెట్ కీపర్గా అడాడు. మరో మూడు మ్యాచ్లు ఆడితే బౌచర్ను అధిగమిస్తాడు. అయితే ధోని వరల్డ్ కప్ 2019లో ఆడటం దాదాపు ఖరారు అయ్యిందని చెప్పాలి.

ఫిబ్రవరి 24నుంచి ఆస్ట్రేలియాతో సుదీర్ఘ సిరిస్
సెలెక్టర్లు కు ధోని మీద అపారమైన నమ్మకం ఉందని వేరే చెప్పాల్సిన పని లేదు. ఫిబ్రవరి 24 నుంచి భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య సుదీర్ఘ సిరిస్ ప్రారంభం కానుంది. ఈ పర్యటనలో భాగంగా ఆస్ట్రేలియా జట్టు ఐదు వన్డేలు, రెండు టీ20ల సిరీస్ ఆడనుంది. వరల్డ్ కప్కు ముందు టీమిండియాకు ఇదే చివరి వన్డే సిరిస్.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications