హైదరాబాద్: ప్రస్తుతం ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న టీమిండియా తొలి టీ20 కోసం మాంచెస్టర్కు చేరుకున్న సంగతి తెలిసిందే. మూడు టీ20ల సిరిస్లో భాగంగా తొలి టీ20 జరిగే మాంచెస్టర్లోని ఓల్డ్ ట్రాఫోర్డ్ స్టేడియంలో కోహ్లీసేన నెట్ ప్రాక్టీస్కు సిద్ధమైంది. టీ20కి ముందు ధావన్-పాండ్యా కలిసి డ్యాన్స్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
ఈ ఇద్దరూ ఎక్కడ ఉంటే అక్కడ సందడే. సహచర ఆటగాళ్లను ఆటపట్టిస్తూ, ఏదో ఒక చిలిపి పని చేస్తూ ఉంటారు. తాజాగా వీరిద్దరూ కలిసి అద్దం ముందు డ్యాన్స్ చేశారు. ఈ వీడియోను హార్దిక్ పాండ్యా తన ట్విటర్ ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. "నేను, జట్టా(శిఖర్ ధావన్ను సహచర ఆటగాళ్లు ఇలాగే పిలుస్తారు) డ్యాన్స్ చేస్తూ దొరికిపోయాం. మా ఇద్దరికీ డ్యాన్స్, పాటలు పాడటం అంటే చాలా ఇష్టం" అని పాండ్యా పేర్కొన్నాడు.
Me & jatta caught in action. We love dancing & singing. 😁 🎶 @SDhawan25 pic.twitter.com/P4vqsuxUVh
— hardik pandya (@hardikpandya7) July 1, 2018
గతంలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ పెళ్లిలో వీరిద్దరూ కలిసి చేసిన డ్యాన్స్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం కోహ్లీ నాయకత్వంలోని టీమిండియా ఇంగ్లాండ్లో పర్యటిస్తోంది. పర్యటనలో భాగంగా ఆతిథ్య ఇంగ్లాండ్తో మూడు టీ20లు, మూడు వన్డేలు, ఐదు టెస్టు మ్యాచ్ల సిరిస్ ఆడనుంది.
మూడు టీ20ల సిరిస్లో భాగంగా ఇరు జట్ల మధ్య మంగళవారం తొలి టీ20 మాంచెస్టర్లోని ఓల్డ్ ట్రాఫోర్డ్ స్టేడియంలో జరగనుంది.